సినీ ఇండస్ట్రీలో ఆ మర్యాదలకి లోటే లేదు: Madhu Mahankali

ABN , First Publish Date - 2022-06-17T01:29:08+05:30 IST

ఎవరైనా పిల్లలు... నేను కలెక్టర్ అవుతాను, డాక్టర్ చదువుతాను.. అంటే తల్లిదండ్రులు సంతోషిస్తారు, గర్వపడతారు. కానీ అదే పిల్లలు.. నేను హీరో అవుతాను, డైరెక్షన్ చేస్తాను, సినిమాటోగ్రాఫర్‌గా పేరు తెచ్చుకుంటాను.. అంటే మాత్రం గాభరాపడతారు. నేటి పరిస్థితుల దృష్ట్యా అలాంటి..

సినీ ఇండస్ట్రీలో ఆ మర్యాదలకి లోటే లేదు: Madhu Mahankali

‘‘ఎవరైనా పిల్లలు... నేను కలెక్టర్ అవుతాను, డాక్టర్ చదువుతాను.. అంటే తల్లిదండ్రులు సంతోషిస్తారు, గర్వపడతారు. కానీ అదే పిల్లలు.. నేను హీరో అవుతాను, డైరెక్షన్ చేస్తాను, సినిమాటోగ్రాఫర్‌గా పేరు తెచ్చుకుంటాను.. అంటే మాత్రం గాభరాపడతారు. నేటి పరిస్థితుల దృష్ట్యా అలాంటి తల్లితండ్రుల ఆలోచనావిధానంలో మార్పు రావాలి’’ అంటున్నారు ప్రముఖ సినిమాటోగ్రాఫర్, దర్శకుడు-నిర్మాత, ‘దాదా సాహెబ్ ఫాల్కే స్కూల్ ఆఫ్ ఫిల్మ్ స్టడీస్’ (Dadasaheb Phalke School of Film Studies) డీన్ మధు మహంకాళి (Madhu Mahankali ). సివిల్ సర్వెంట్స్‌కి, డాక్టర్స్‌కి, లాయర్స్‌కి తీసిపోని గౌరవమర్యాదలు... సినిమా రంగంలో రాణిస్తున్నవారికి దక్కుతున్నాయనే విషయాన్ని తల్లిదండ్రులు గమనించాలని ఆయన పిలుపునిచ్చారు. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, కళాతపస్వి కె.విశ్వనాధ్ (K Viswanath) చేతుల మీదుగా మొదలై... అగ్ర నిర్మాతలు అల్లు అరవింద్ (Allu Aravind), దిల్ రాజు (Dil Raju) వంటి చిత్ర ప్రముఖుల ప్రోత్సాహంతో తెలుగు చిత్రసీమకు గత ఐదేళ్లుగా ఎందరో ప్రతిభావంతుల్ని పరిచయం చేస్తున్న ‘దాదా సాహెబ్ ఫాల్కే స్కూల్ ఆఫ్ ఫిల్మ్ స్టడీస్’ విజయవంతంగా ఐదు వసంతాలు పూర్తి చేసుకుని, ఆరో ఏట అడుగుపెడుతున్న సందర్భంగా మధు మహంకాళి ప్రత్యేకంగా ముచ్చటించారు. తెలుగు రాష్ట్రాల్లో... దిగువ మధ్య తరగతివారికి అందుబాటులో అత్యున్నత ప్రమాణాలు కలిగిన ఏకైక ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ తమదేనని మహంకాళి పేర్కొన్నారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘అంతర్జాతీయ ప్రమాణాలు... అందరికీ అందుబాటులో ఫీజులు.. అనే సిద్ధాంతంతో ప్రగతిపథంలో దూసుకుపోతున్న దాదా సాహెబ్ ఫాల్కే స్కూల్ ఆఫ్ ఫిల్మ్ స్టడీస్‌లో యాక్టింగ్, డైరెక్షన్, సినిమాటోగ్రఫీలకు మాత్రమే పరిమితం కాకుండా... ఎడిటింగ్, స్క్రిప్ట్ రైటింగ్, డిజిటల్ మ్యూజిక్ ప్రొడక్షన్ వంటి కోర్సులు సైతం ఉండడం ఈ స్కూల్‌కి ఉన్న  ప్రత్యేకత. ఇప్పటివరకు ఈ ఫిల్మ్ స్కూల్‌లో కోర్సులు చేసినవారంతా... ఇండస్ట్రీలో వివిధ శాఖల్లో విశేషంగా రాణిస్తున్నారు. నేషనల్, ఇంటర్నేషనల్, రీజినల్ సినిమాలపై సమగ్ర అవగాహన కలిగేలా ఇక్కడ సిలబస్ డిజైన్ చేశాం. మన దేశంలో ఉన్న బెస్ట్ ఫిల్మ్ స్కూల్స్ అనుసరించే సిలబస్ బాగా స్టడీ చేసి... వాటన్నిటిలో ఉన్న ఉత్తమ అంశాలు మేళవించి... ఈ ఫిల్మ్ స్కూల్ బోధనను పొందుపరిచాము. సినిమా రంగంలో రాణించాలనుకునేవారు... అన్ని శాఖల పట్ల అవగాహన పెంచుకోవడం ఎంతైనా అవసరం..’’ అని మధు మహంకాళి చెప్పుకొచ్చారు. 


మధు మహంకాళి విషయానికి వస్తే.. అహ్మదాబాద్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (ఎన్.ఐ.డి)లో చదివి, తర్వాత పూనా ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ నుంచి సినిమాటోగ్రఫీలో డిప్లొమా చేసిన మధు మహంకాళి... అస్సామీలో అరంగేట్రం చేసి, అక్కడ పలు చిత్రాలకు ఛాయాగ్రహణం అందించారు. అనంతరం తెలుగులో అనేక సినిమాలు, సీరియల్స్‌కు సినిమాటోగ్రఫీ సమకూర్చారు. హిందీలోనూ పనిచేశారు. స్వీయనిర్మాణంలో నరేష్-ఆమని జంటగా ‘పరంపర’ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికిగాను నరేష్‌కి నంది అవార్డు లభించింది. బుల్లితెర ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించిన ‘ఋతురాగాలు, కస్తూరి’ వంటి ధారావాహికలతో సుపరిచితురాలైన ప్రఖ్యాత నటి రూపాదేవి (Roopa Devi) వీరి ధర్మపత్ని.

Updated Date - 2022-06-17T01:29:08+05:30 IST