Good bye: రాజకీయాలకు గుడ్‌బై..? మళ్లీ తెరంగేట్రం చేయనున్న సినీనటి

ABN , First Publish Date - 2022-08-13T18:19:19+05:30 IST

శాండల్‌వుడ్‌ క్వీన్‌గా ఖ్యాతి పొందిన మండ్య మాజీ ఎంపీ, సినీనటి రమ్య(Former MP and actress Ramya) రాజకీయాలపై అనాసక్తితో ఉన్నారు.

Good bye: రాజకీయాలకు గుడ్‌బై..? మళ్లీ తెరంగేట్రం చేయనున్న సినీనటి

బెంగళూరు, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): శాండల్‌వుడ్‌ క్వీన్‌గా ఖ్యాతి పొందిన మండ్య మాజీ ఎంపీ, సినీనటి రమ్య(Former MP and actress Ramya) రాజకీయాలపై అనాసక్తితో ఉన్నారు. 2023 శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశ్యం లేదని ఆమె ఇప్పటికే పరోక్ష సంకేతాలు ఇచ్చారు. లోక్‌సభ ఎన్నికల్లోనూ పోటీ చేసే ఆలోచన లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతానికి చందనసీమలో మళ్లీ నటించేందుకే ఆమె మొగ్గు చూపుతున్నట్టు కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ఇప్పటికే ఒక సినిమాకు తానే స్వయంగా కథ సమకూర్చి నిర్మించడంతోపాటు ప్రముఖ పాత్ర పోషించే ఆలోచన రమ్యకు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాకు రాజ్‌ బీశెట్టి దర్శకత్వం వహిస్తారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్‌ టికెట్‌పై గతంలో మండ్య నుంచి ఎంపికైన రమ్య ఒకదశలో కాంగ్రెస్‌(Congress) అగ్రనేత రాహుల్‌గాంధీకి అత్యంత సన్నిహితులలో ఒకరిగా మారారు. వివాదాస్పద ప్రకటనలు, ట్వీట్లతో పలుమార్లు విమర్శలను కూ డా మూటగట్టుకున్నారు. రాజకీయాలపై భ్రమలు తొలగిపోయాయని ఇకప మిగిలిన సమయాన్ని సినిమాలకే వెచ్చించాలని ఆలోచిస్తున్నట్టు తన సన్నిహితుల వద్ద రమ్య పేర్కొన్నట్టు కథనాలు వినిపిస్తున్నాయి. 

Updated Date - 2022-08-13T18:19:19+05:30 IST