Liger: తెలుగు ట్రైలర్ను ఎవరు విడుదల చేయబోతున్నారో తెలుసా?
ABN , First Publish Date - 2022-07-21T03:10:23+05:30 IST
రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), పూరీ జగన్నాథ్ (Puri Jagannadh) కాంబినేషన్లో తెరకెక్కిన క్రేజీ పాన్ ఇండియా చిత్రం ‘లైగర్’ (Liger). ఈ భారీ చిత్ర ట్రైలర్ లాంచ్ ఈవెంట్ని
రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), పూరీ జగన్నాథ్ (Puri Jagannadh) కాంబినేషన్లో తెరకెక్కిన క్రేజీ పాన్ ఇండియా చిత్రం ‘లైగర్’ (Liger). ఈ భారీ చిత్ర ట్రైలర్ లాంచ్ ఈవెంట్ని సౌత్తో పాటు నార్త్లో కూడా నిర్వహించాలని నిర్మాతలు నిర్ణయించారు. ఈ చిత్ర ట్రైలర్ని జూలై 21న హైదరాబాద్, ముంబైలో గ్రాండ్గా విడుదల చేయబోతున్నారు. హైదరాబాద్ ఈవెంట్ ఆర్ టీ సి క్రాస్ రోడ్స్ లోని సుదర్శన్ థియేటర్లో ఉదయం 9:30 గంటలకు జరుగుతుంది. ముంబై ఈవెంట్ అంధేరిలోని సినీపోలీస్లో సాయంత్రం 7:30 గంటలకు జరుగుతుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. తాజాగా ఈ చిత్ర తెలుగు ట్రైలర్ను ఎవరు విడుదల చేయబోతున్నారో కూడా మేకర్స్ ప్రకటించారు. తెలుగు ట్రైలర్ను మెగాస్టార్ చిరంజీవి (Mega Star Chiranjeevi), యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ (Young Rebel Star Prabhas) ఉదయం 9:30 గంటలకు విడుదల చేయనున్నారు. పూరిజగన్నాథ్ అఫీషియల్ యూట్యూబ్ ద్వారా ఈ ట్రైలర్ విడుదల కానుంది. అలాగే మలయాళ ట్రైలర్ను యంగ్ హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) విడుదల చేయనున్నారని కూడా మేకర్స్ తెలిపారు. సోనీ మ్యూజిక్ సౌత్ ద్వారా ఈ ట్రైలర్ విడుదల కానుంది.
భారీ స్థాయిలో విడుదల కాబోతోన్న ఈ ట్రైలర్ ఇంటర్నెట్లో తుఫాన్ సృష్టించడం ఖాయం అన్నట్లుగా చిత్రయూనిట్ తెలుపుతోంది. విజయ్ దేవరకొండ సరసన అనన్య పాండే కథానాయికగా నటిస్తున్న ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాలో లెజెండ్ మైక్ టైసన్ ఇండియన్ స్క్రీన్పై అరంగేట్రం చేస్తున్నారు. పూరి కనెక్ట్స్ , బాలీవుడ్ స్టార్ ప్రొడక్షన్ కంపెనీ ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహర్, అపూర్వ మెహతా నిర్మాతలు. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ , మలయాళం భాషల్లో రూపొందుతున్న ఈ పాన్ ఇండియా చిత్రం 2022 ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.