Mahesh Babu: మహేష్, కృష్ణలను పరామర్శించిన చిరంజీవి

ABN , First Publish Date - 2022-09-29T21:28:47+05:30 IST

మెగాస్టార్ చిరంజీవి (Mega Star Chiranjeevi) ఈరోజు గురువారం పద్మాలయ (Padmala Studios) స్టూడియో కి వెళ్లి మహేష్ బాబు (Mahesh Babu), కృష్ణ (Superstar Krishna) లను పరామర్శించాడు.

Mahesh Babu: మహేష్, కృష్ణలను పరామర్శించిన చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి (Mega Star Chiranjeevi) ఈరోజు గురువారం పద్మాలయ (Padmala Studios) స్టూడియో కి వెళ్లి మహేష్ బాబు (Mahesh Babu), కృష్ణ (Superstar Krishna) లను పరామర్శించాడు. కృష్ణ సతీమణి, మహేష్ తల్లి ఇందిరాదేవి (Indiradevi) బుధవారం ఉదయం తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. అయితే చిరంజీవి తన సినిమా 'గాడ్ ఫాదర్' (God Father) ప్రీ రిలీజ్ ఈవెంట్ (Pre-release) అనంతపూర్ (Ananthapur) లో బుధవారం పెట్టుకున్నారు. అందువల్ల చిరంజీవి వెంటనే రాలేకపోయాడు పరామర్శించడానికి. 


నిన్న రాత్రి మళ్ళీ అనంతపూర్ నుండి హైదరాబాద్ చేరుకున్న చిరంజీవి, ఈరోజు ఉదయం సుమారు 11 గంటల సమయం లో మహేష్, కృష్ణలను కలిసి వారిద్దరిని పరామర్శించాడు. సుమారు 20 నిముషాల (20 minutes) పాటు వారిద్దరితో చిరంజీవి గడిపాడు. చెన్నై (Chennai) లో కృష్ణ మరియు చిరంజీవి (Chiranjeevi and Krishna houses) ఇళ్ళు ఎదురెదురుగా ఉండటంతో, రెండు కుటుంబాలకు (Two families) అప్పటి నుండే మంచి సత్సంబంధాలు వున్నాయి. చిరంజీవి ఆ పాత మధురానుభూతులను (memories) కృష్ణ, మహేష్ బాబు లతో పంచుకొని ఇందిరాదేవిని ఒకసారి తలుచుకున్నారని (Remembering) తెలిసింది. ముందుగా మహేష్ బాబు తన తల్లి చిత్ర పటానికి పూలు వేసి నివాళులు (Tribute) అర్పించారు. తరువాత చిరంజీవి  వచ్చాక, అతను కూడా ఇందిర కి నివాళులు (Tribute) అర్పించారు. 

Updated Date - 2022-09-29T21:28:47+05:30 IST