‘పద్మ’ అవార్డులు పొందిన విజేతలకు అభినందనలు: చిరంజీవి

ABN , First Publish Date - 2022-01-26T04:44:35+05:30 IST

గణతంత్ర దినోత్సవం సందర్భంగా 2022 సంవత్సరానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ పురస్కార గ్రహీతలకు మెగాస్టార్ చిరంజీవి శుభాభినందనలు తెలిపారు. ఈ అవార్డులకు ఎంపికైన తెలుగు రాష్ట్రాల వారికి

‘పద్మ’ అవార్డులు పొందిన విజేతలకు అభినందనలు: చిరంజీవి

గణతంత్ర దినోత్సవం సందర్భంగా 2022 సంవత్సరానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ పురస్కార గ్రహీతలకు మెగాస్టార్ చిరంజీవి శుభాభినందనలు తెలిపారు. ఈ అవార్డులకు ఎంపికైన తెలుగు రాష్ట్రాల వారికి చిరు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.


‘‘ ‘పద్మ’ అవార్డులు పొందిన విజేతలందరికీ నా శుభాభినందనలు. వీరిలో మన రాష్ట్రానికే చెందిన ప్రముఖులు శ్రీ గరికపాటి నరసింహారావు, శ్రీమతి షావుకారు జానకి, శ్రీమతి పద్మజా రెడ్డి, శ్రీ మొగులయ్య, శ్రీ షేక్ హాసన్, డా. సుంకర ఆదినారాయణ, కృష్ణా, సుచిత్రా ఎల్లా గార్లు, నా మిత్రుడు శ్రీ గులాంనబీ ఆజాద్‌గారికి, సింగర్ సోనూ నిగమ్‌కి, భారతీయులకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు, గౌరవం తెచ్చిన శ్రీ సత్య నాదెళ్ల, శ్రీ సుందర్ పిచాయ్‌లు ఉండటం మరింత సంతోషాన్ని కలిగిస్తోంది. వారికి నా ప్రత్యేక అభినందనలు, శుభాకాంక్షలు..’’ అని చిరంజీవి తన ట్వీట్‌లో పేర్కొన్నారు. 



Updated Date - 2022-01-26T04:44:35+05:30 IST