Charmme kaur: షాకింగ్‌ నిర్ణయం!

ABN , First Publish Date - 2022-09-04T18:53:16+05:30 IST

ప్యాన్‌ ఇండియా స్థాయిలో భారీ అంచనాల మధ్య విడుదలైన ‘లైగర్‌’ పరాజయం కావడంతో చిత్ర బృందం తీవ్ర నిరాశలో ఉంది. ఓ పక్క విపరీతంగా సినిమా గురించి ట్రోల్‌ జరిగినా సినిమా టీమ్‌కు సంబంధించి ఎవరూ బయటికొచ్చి మాట్లాడింది లేదు.

Charmme kaur: షాకింగ్‌ నిర్ణయం!

ప్యాన్‌ ఇండియా స్థాయిలో భారీ అంచనాల మధ్య విడుదలైన ‘లైగర్‌’ (Liger)పరాజయం కావడంతో చిత్ర బృందం తీవ్ర నిరాశలో ఉంది. ఓ పక్క విపరీతంగా సినిమా గురించి ట్రోల్‌ జరిగినా సినిమా టీమ్‌కు సంబంధించి ఎవరూ బయటికొచ్చి మాట్లాడింది లేదు. నిర్మాతల్లో ఒకరైన ఛార్మి కౌర్‌ (charmme kaur) తాజాగా స్పందించారు. ఈ మేరకు ఆమె ఓ ట్వీట్‌ చేశారు. కొంతకాలంపాటు సోషల్‌ మీడియాకు దూరంగా ఉండాలనుకుంటునట్లు ఆమె ప్రకటించారు. ఈ విషయాన్ని చెబుతూ ఆదివారం ఛార్మి ట్వీట్‌ చేశారు. ‘‘ఛిల్‌ గయ్స్‌..  సోషల్‌మీడియా నుంచి కాస్త బ్రేక్‌ తీసుకుంటున్నా. ‘పూరీ కనెక్ట్స్‌’ సంస్థ మరింత బలంగా. ఉన్నతంగా సిద్ధమై త్వరలోనే మళ్లీ తిరిగి వస్తుంది. అప్పటి వరకే ప్రశాంతంగా జీవించండి.. జీవించనివ్వండి’’ అని ట్వీట్‌లో పేర్కొంది. ఛార్మి ట్వీట్‌ ఇప్పుడు వైరల్‌ అవుతోంది. 






విజయ్‌ దేవరకొండ, పూరీ జగన్నాథ్‌ కాంబినేషన్‌లో యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన చిత్రమిది. దాదాపు రూ.100 కోట్లతో ఈ చిత్రాన్ని రూపొందించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం తొలి షో నుంచే నెగటివ్‌ టాక్‌ తెచ్చుకుంది. కొన్ని ప్రాంతాల్లో షోలు ఖాళీగా ఉండడంతో ఈ చిత్రాన్ని తీసేసిన సందర్భాలున్నాయి. అనన్యా పాండే కథానాయికగా రూపొందిన ఈ చిత్రంలో మైక్‌ టైసన్‌ కీలక పాత్ర పోషించారు.  


Updated Date - 2022-09-04T18:53:16+05:30 IST