Charmme Kaur: అవన్నీ ఫేక్.. పీసీ పవరేంటో చూపిస్తాం

ABN , First Publish Date - 2022-09-09T01:35:50+05:30 IST

నటి, నిర్మాత ఛార్మీ కౌర్ (Charmme Kaur) తాజాగా ‘రూమర్స్‌కు రిప్’ అంటూ చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. ఎందుకలా ఆమె ట్వీ్ట్ చేసింది. సోషల్ మీడియాకి కొన్ని రోజుల పాటు

Charmme Kaur: అవన్నీ ఫేక్.. పీసీ పవరేంటో చూపిస్తాం

నటి, నిర్మాత ఛార్మీ కౌర్ (Charmme Kaur) తాజాగా ‘రూమర్స్‌కు రిప్’ అంటూ చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. ఎందుకలా ఆమె ట్వీ్ట్ చేసింది. సోషల్ మీడియాకి కొన్ని రోజుల పాటు దూరంగా ఉంటానని చెప్పిన ఛార్మీ.. సడెన్‌గా మళ్లీ ఈ ట్వీటేంటి? అనేది తెలియాలంటే పూర్తి కథనం చదవాల్సిందే. విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)తో చేసిన ‘లైగర్’ (Liger) సినిమా రిజల్ట్‌తో పూరి జగన్నాథ్ (Puri Jagannadh), ఛార్మిలకు మైండ్ బ్లాంకయింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆ చిత్రం.. బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా కొట్టడంతో.. ఇంతకు ముందెన్నడూ లేనంతగా సోషల్ మీడియాలో వారు టార్గెట్ అవుతున్నారు. ముఖ్యంగా విజయ్ దేవరకొండ అభిమానులు ‘లైగర్’ సినిమాతో తమ హీరో కెరీర్ టర్న్ అవుతుందని, పాన్ ఇండియా అంతా ఆయన పేరు మారుమోగుతుందని భావించారు. సినిమా విడుదలకు ముందు వచ్చిన హైప్ అలా అనిపించింది మరి. అయితే సినిమా విడుదల తర్వాత ఒక్కసారిగా వారిలో నీరసం, నిరాశ వంటివి అలుముకున్నాయి. విజయ్ అంత సపోర్ట్ ఇచ్చినా.. ఇటువంటి ప్రొడక్ట్‌ని దించారేంటి అంటూ.. పూరి, ఛార్మీలపై ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు.. అవుతున్నారు. నెగిటివ్ కామెంట్లతో అనేక రూమర్లని స్ప్రెడ్ చేస్తున్నారు. 


విజయ్ అభిమానులతో పాటు.. సినిమా చూసిన నెటిజన్లు కూడా పూరి, ఛార్మీలపై.. ‘ఏంటా సినిమా?’ అంటూ కట్టిగానే ఎక్కేశారు. ఈ పోరు తట్టుకోలేకే.. రీసెంట్‌గా సోషల్ మీడియాకు కొన్ని రోజుల పాటు దూరంగా ఉంటానని, అప్పటి వరకు మీరు బతకండి.. మమ్మల్ని బతకనివ్వండి అంటూ ఛార్మీ ట్వీ్ట్ చేసింది. ఇక ఎప్పుడైతే ఛార్మీ సోషల్ మీడియాలో ఈ పోస్ట్ పెట్టిందో.. అప్పటి నుండి పూరి, ఛార్మీలపై మరింతగా రూమర్స్ వైరల్ అవుతున్నాయి. ‘లైగర్’ తర్వాత విజయ్‌తో మళ్లీ వారు చేయాలనుకున్న ‘జనగణమన’ (JGM) ప్రాజెక్ట్ ఆగిపోయిందని, అలాగే ముంబై నుంచి మకాం మార్చేస్తున్నారనేలా రూమర్స్ గుప్పుమన్నాయి. మరి వాటిని ఖండించాలని చేసిందో.. లేక ఎన్ని ప్లాపులొచ్చినా.. పూరి కనెక్ట్స్‌(PC)ని వదిలేదే లే అని చెప్పాలనుకుందో తెలియదు కానీ.. వినిపిస్తున్నవన్నీ రూమర్లే అని ఓ ట్వీట్ వదిలింది. ‘‘రూమర్స్ రూమర్స్ రూమర్స్.. వినిపిస్తున్న రూమర్లలన్నీ ఫేక్. ప్రస్తుతం ‘పూరి కనెక్ట్స్’ పురోగతిపైనే దృష్టి పెట్టాం.. అప్పటి వరకు రూమర్స్‌‌కి రిప్’’ అంటూ ఛార్మీ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్‌కు నెటిజన్లు రకరకాల రియాక్షన్లతో కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ఆమె ట్వీట్ వైరల్‌గా మారి ట్రెండ్ అవుతోంది.



Updated Date - 2022-09-09T01:35:50+05:30 IST