Charmme Kaur: లైగర్ ఫెయిల్యూర్‌పై స్పందించిన ఛార్మీ.. పరిస్థితి భయానకంగా ఉందంటూ..

ABN , First Publish Date - 2022-08-29T18:12:00+05:30 IST

విడుదలకి ముందు భారీ హైప్‌ క్రియేట్ చేసిన తుస్సుమనిపించిన మూవీ ‘లైగర్(Liger)’. టాలీవుడ్ స్టార్స్ పూరీ జగన్నాథ్, విజయ్ దేవరకొండ..

Charmme Kaur: లైగర్ ఫెయిల్యూర్‌పై స్పందించిన ఛార్మీ.. పరిస్థితి భయానకంగా ఉందంటూ..

విడుదలకి ముందు భారీ హైప్‌ క్రియేట్ చేసిన తుస్సుమనిపించిన మూవీ ‘లైగర్(Liger)’. టాలీవుడ్ స్టార్స్ పూరీ జగన్నాథ్, విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) కాంబినేషన్‌లో తెరకెక్కింది. అనన్య పాండే హీరోయిన్‌గా నటించిన ఈ మూవీలో రమ్యకృష్ణ, మైక్ టైసన్ ప్రధానపాత్రల్లో నటించారు. ఈ పాన్ ఇండియా సినిమాని ధర్మ ప్రొడక్షన్స్‌, పూరీ టాకీస్ సంయుక్తంగా నిర్మించాయి. అయితే.. ఫస్ట్‌లుక్ పోస్టర్, టీజర్, ట్రైలర్స్ కారణంగా ఈ సినిమా మీద మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఈ తరుణంలో ఆగస్టు 25న విడుదలైన ఈ సినిమా మిక్స్‌డ్ రివ్యూస్, ఇంకా కరెక్టుగా చెప్పాలంటే ఫ్లాప్‌గా మిగిలింది. ఈ మూవీ ఫెయిల్యూర్‌పై తాజాగా ఇంటర్వ్యూలో నిర్మాతల్లో ఒకరైన ఛార్మీ కౌర్ (Charmme Kaur) స్పందించింది.


ఛార్మీ మాట్లాడుతూ.. ‘కచ్చితంగా.. జనాలు ఇంట్లో కూర్చొని ఒక క్లిక్‌తో మంచి కంటెంట్‌ను యాక్సెస్ చేయగలరు. కుటుంబ సమేతంగా టెలివిజన్‌లో అత్యంత భారీ బడ్జెట్ చిత్రాలను చూడగలరు. సినిమాలు వారిని ఎగ్జైట్ చేయనంత వరకు ప్రేక్షకులు థియేటర్‌లకు రావడానికి ఇష్టపడడం లేదు. కానీ.. బాలీవుడ్‌‌కి మాత్రం ఈ సూత్రం వర్తించదు. వారు థియేటర్స్‌కి రావడానికి ముందు ఇతర విషయాలపై కూడా దృష్టిపెడుతున్నారు. కాగా.. ఇటీవలే తెలుగులో బింబిసార, సీతారామం, కార్తికేయ 2 వంటి మంచి కంటెంట్ ఉన్న చిత్రాలు టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతంగా ఆకట్టుకున్నాయి. ఇవి రూ. 150 నుంచి 170 కోట్లు వరకూ వసూలు చేశాయి. అయినా.. దక్షిణాదిలో సినిమాలంటే గతంలో ఉన్న పిచ్చి ఇప్పుడు లేదనిపిస్తోంది. అయితే.. బాలీవుడ్‌లో మాత్రం పరిస్థితి చాలా భయానకంగా, నిరుత్సాహకరంగా ఉంది’ అని చెప్పుకొచ్చింది.


అలాగే లైగర్ గురించి మాట్లాడుతూ.. ‘మేము 2019లో కరణ్ జోహార్‌తో కలిశాం. మేము జనవరి 2020లో లైగర్ మొదటి షెడ్యూల్‌ని ప్రారంభించాం. కరోనా లాక్‌డౌన్ కారణంగా దాదాపు మూడు సంవత్సరాల తర్వాత ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాం. ఎన్నో మంచి అవకాశాలను కోల్పోయి.. ఎన్నో అడ్డంకులను దాటి థ్రియేటర్స్‌లో విడుదల చేశాం. అయినా ఫెయిల్యూర్ అవడం కొంచెం బాధగానే ఉంది’ అని తెలిపింది.

Updated Date - 2022-08-29T18:12:00+05:30 IST