త్వరలో సెట్స్పైకి చైతు - పరశురామ్ కాంబో మూవీ..?
ABN , First Publish Date - 2022-04-29T17:14:09+05:30 IST
అక్కినేని నాగ చైతన్య - పరశురామ్ కాంబినేషన్లో ఓ మూవీ త్వరలో సెట్స్పైకి రాబోతుందని తాజా సమాచారం. వాస్తవంగా అయితే గీత గోవిందం సినిమా తర్వాత వీరి కాంబినేషన్లో సినిమా మొదలవ్వాల్సింది.
అక్కినేని నాగ చైతన్య - పరశురామ్ కాంబినేషన్లో ఓ మూవీ త్వరలో సెట్స్పైకి రాబోతుందని తాజా సమాచారం. వాస్తవంగా అయితే గీత గోవిందం సినిమా తర్వాత వీరి కాంబినేషన్లో సినిమా మొదలవ్వాల్సింది. కానీ, అనూహ్యంగా పరశురామ్ కి సూపర్ స్టార్ మహేశ్ బాబు నుంచి పిలుపు రావడంతో సర్కారు వారి పాట సినిమాను సెట్స్ మీదకు తీసుకువచ్చారు. ఈ సినిమా పూర్తై, మే 12న భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీంతో మళ్ళీ దర్శకుడు పరశురామ్ నాగ చైతన్యతో కమిటైన సినిమాపై ఫోకస్ పెట్టబోతున్నట్టు సమాచారం.
ఇటీవలే లవ్ స్టోరి సినిమాతో భారీ హిట్ అందుకున్న చైతూ.. థాంక్యూ, బాలీవుడ్ మూవీ లాల్ సింగ్ చద్దా చిత్రాలను పూర్తి చేశాడు. ఈ రెండు చిత్రాలు విడుదలకు సిద్దమవుతున్నాయి. ప్రస్తుతం చైతూ..అమెజాన్ ప్రైమ్ కోసం 'దూత' అనే వెబ్ సిరీస్ చేస్తున్నాడు. దీనికి విక్రమ్ కుమార్ దర్శకుడు. అలాగే, తమిళ దర్శకుడు వెంకట్ ప్రభుతో ఓ బైలింగ్వల్ సినిమా షూటింగ్ త్వరలో మొదలవబోతోంది. ఈ క్రమంలోనే నాగ చైతన్య - పరశురామ్ కాంబో సినిమా కూడా మొదలవనుందని సమాచారం.