SirivennelaSeetharamaSastry: కడసారి చూపు కోసం తరలివచ్చిన సినీ ప్రముఖులు
ABN , First Publish Date - 2021-12-01T15:40:05+05:30 IST
ప్రముఖ సినీ గేయ రచయిత ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి కడసారి చూపుకోసం సినీ, రాజకీయ ప్రముఖులు ఫిల్మ్ ఛాంబర్కు తరలి వస్తున్నారు.
హైదరాబాద్: ప్రముఖ సినీ గేయ రచయిత ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి కడసారి చూపుకోసం సినీ ప్రముఖులు ఫిల్మ్ ఛాంబర్కు తరలి వచ్చారు. అనారోగ్యంతో మంగళవారం సాయంత్రం తుదిశ్వాస విడిచిన సీతారామశాస్త్రి భౌతికకాయన్ని బుధవారం ఉదయం అభిమానుల సందర్శనార్థం ఫిల్మ్ ఛాంబర్కు తీసుకొచ్చారు. ఈ క్రమంలో సినీ ప్రముఖులు ఫిల్మ్ ఛాంబర్కు చేరుకుని ఆయన పార్థివదేహానికి కన్నీటి నివాళులు అర్పించారు.
చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, పవన్ కల్యాణ్, మహేశ్ బాబు, జూనియర్ ఎన్టీయార్, జగపతిబాబు, నాగబాబు, శ్రీకాంత్, రాజశేఖర్, అల్లు అర్జున్, నాని, రానా దగ్గుబాటి, శర్వానంద్ తదితరులు సిరివెన్నెలకు నివాళులర్పించారు. ఇక రాజమౌళి, కీరవాణి, మణిశర్మ, గుణశేఖర్, క్రిష్ జాగర్లమూడి, మారుతి, పరుచూరి గోపాలకృష్ణ, ఆచంట గోపీనాథ్, ఎస్వీ కృష్ణారెడ్డి, కే అచ్చిరెడ్డి, తనికెళ్ల భరణి, రావు రమేష్, నిర్మాతలు అల్లు అరవింద్, ప్రసాద్, కేఎల్ నారాయణ, చోటా కే నాయుడు, సింగర్ సునీత తదితరులు సిరివెన్నెల సీతారామశాస్త్రి పార్థివదేహానికి నివాళులర్పించారు.
సిరివెన్నెల సీతారామశాస్త్రి అంతిమ యాత్ర బుధవారం మధ్యాహ్నం నిర్వహించనున్నారు. జూబ్లీహిల్స్లోని మహాప్రస్థానంలో మధ్యాహ్నం 1 గంటకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు.