కెప్టెన్‌ మిల్లర్‌ కహాని

ABN , First Publish Date - 2022-07-04T07:13:12+05:30 IST

ధనుష్‌ - అరుణ్‌ మాధేశ్వరన్‌ కలయికలో ఓ చిత్రం రూపుదిదు కుంటోంది. సెంధిల్‌ త్యాగరాజన్‌, అర్జున్‌ త్యాగరాజన్‌ నిర్మాతలు...

కెప్టెన్‌ మిల్లర్‌ కహాని

ధనుష్‌ - అరుణ్‌ మాధేశ్వరన్‌ కలయికలో ఓ చిత్రం రూపుదిదు కుంటోంది. సెంధిల్‌ త్యాగరాజన్‌, అర్జున్‌ త్యాగరాజన్‌ నిర్మాతలు. ఈ చిత్రానికి ‘కెప్టెన్‌ మిల్లర్‌’ అనే టైటిల్‌ ఖరారు చేశారు. 1930 - 1940 నేపథ్యంలో సాగే కథ ఇది. యేడాది నుంచి ఈ సినిమా కథపై దర్శకుడు కసరత్తు చేస్తున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ ‘‘ఓ అసాధారణమైన కథ ఇది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నాం. ఇలాంటి సినిమా మా సత్యజ్యోతి ఫిలింస్‌ సంస్థలో రూపొందించడం గర్వంగా ఉంది. దేశంలోని అత్యుత్తమ నటీనటులు, సాంకేతిక నిపుణులు ఈ సినిమా కోసం పనిచేస్తున్నార’’న్నారు.  


Updated Date - 2022-07-04T07:13:12+05:30 IST