‘కాలింగ్ సహస్ర’ టీజర్: చావంటే కేవలం ప్రాణం పోవడమే కాదు.. మరి?
ABN , First Publish Date - 2022-04-02T03:07:29+05:30 IST
సుడిగాలి సుధీర్.. పరిచయం అక్కరలేని పేరు. జబర్దస్త్ కమెడియన్గా, ప్రోగ్రాం హోస్ట్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సుధీర్.. వెండితెరపై కూడా తన మార్క్ ప్రదర్శించేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. వైవిధ్యభరితమైన కథలను
సుడిగాలి సుధీర్.. పరిచయం అక్కరలేని పేరు. జబర్దస్త్ కమెడియన్గా, ప్రోగ్రాం హోస్ట్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సుధీర్.. వెండితెరపై కూడా తన మార్క్ ప్రదర్శించేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. వైవిధ్యభరితమైన కథలను ఎన్నుకుంటూ.. హీరోగా ముందుకు సాగుతున్న సుధీర్.. తాజాగా ‘కాలింగ్ సహస్ర’ అనే డిఫరెంట్ క్రైం స్టోరీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఈ చిత్ర టీజర్ని శుక్రవారం నిర్మాత అల్లు అరవింద్ చేతుల మీదుగా విడుదల చేశారు. ఒక నిమిషం 18 సెకనుల నిడివితో ఉన్న ఈ టీజర్లో చూపించిన ప్రతి సన్నివేశం కూడా సినిమాపై ఆసక్తిని పెంచేదిలా ఉంది.
‘బ్రతకడం కోసం చంపడం సృష్టి దర్మం. మరి చంపడం తప్పు కానప్పుడు దాన్ని చూపించడం తప్పెలా అవుతుంది’ అనే డైలాగ్తో ప్రారంభమైన ఈ టీజర్ ఆద్యంతం మిస్టరీని తలపించింది. గతంలో ఎన్నడూ చూడని సరికొత్త క్రైమ్ థ్రిల్లర్గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోందనేది ఈ టీజర్తో తెలుస్తోంది. టీజర్లో చివరగా చెప్పిన ‘చావంటే కేవలం ప్రాణం పోవడం కాదురా, మన కళ్ల ముందు మనం ప్రేమించిన వాళ్ళు పోవడం’ అనే డైలాగ్తో.. ఈ చిత్రంలో ప్రేమకథ కూడా ఉందనేది అర్థమవుతోంది. కాగా, రాధా ఆర్ట్స్, షాడో మీడియా ప్రొడక్షన్ సంయుక్త సమర్పణలో రూపొందిన ఈ చిత్రాన్ని అరుణ్ విక్కీరాల దర్శకత్వంలో విజేష్ కుమార్ తయల్, చిరంజీవి పామిడి, వెంకటేశ్వర్లు కాటూరి నిర్మించారు.