ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు Butterfly
ABN , First Publish Date - 2022-07-05T19:06:53+05:30 IST
అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 'బటర్ ఫ్లై' (Butterfly) నేరుగా ఓటీటీ ద్వారా విడుదల చేయబోతున్నారు.
అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 'బటర్ ఫ్లై' (Butterfly) నేరుగా ఓటీటీ ద్వారా విడుదల చేయబోతున్నారు. అనుపమ నటించిన మరో రెండు చిత్రాలు కూడా రిలీజ్కు రెడీ అవుతున్నాయి. ఈ రెండు చిత్రాలలో హీరో నిఖిల్ సిద్దార్థ (Nikhil Sidhartha) కావడం విశేషం. ఓ సినిమా కార్తికేయ (Karthikeya)కి సీక్వెల్గా రూపొందుతోంది. మరో సినిమా 18 పేజెస్ (18 Pages). ఈ సినిమాలు రిలీజ్ అయి హిట్ సాధిస్తే మాత్రం మళ్ళీ అనుపమ ఈజ్ బ్యాక్ అని అందరూ చెప్పుకుంటారు.
ఇక తను నటించిన ఫీమేల్ సెంట్రిక్ మూవీ 'బటర్ ఫ్లై' ముందునుంచీ థియేట్రికల్ రిలీజ్ చేస్తారనే ప్రచారం జరిగింది. అయితే, తాజాగా ఈ సినిమాను డిస్నీ హాట్స్టార్ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారట. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా విడుదల కానుంది. తేదీ ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. దీనికి సంబంధించిన అప్డేట్ రానుంది.
ఇక ఈ మధ్య కాలంలో చిన్న సినిమాలకు థియేటర్లలో ఆదరణ కరువవ్వడంతో మంచి ఆఫర్ వస్తే నేరుగా ఓటీటీలోనే రిలీజ్ చేసేస్తున్నారు. ఈ క్రమంలోనే 'బటర్ ఫ్లై' సినిమాను నేరుగా ఓటీటీలోనే విడుదల చేస్తే బాగుంటుందని పలువురు సినీ ప్రముఖులు, నిర్మాతలకు సూచించారు. దీంతో చిత్ర నిర్మాతలు ఓటీటీ ద్వారా రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కాగా, ఈ సినిమాకు ఘంటా సతీశ్ బాబు కథను, స్క్రీన్ ప్లేను అందించడంతో పాటుగా దర్శకత్వం వహించారు. రవి ప్రకాశ్ బోడపాటి, ప్రసాద్ తిరువళ్లూరి, ప్రదీప్ నల్లిమెల్లి ఈ సినిమాను నిర్మించారు.
ఓ అపార్ట్మెంట్లో జరిగే ఆసక్తికర సంఘటనలతో థ్రిల్లర్ జోనర్ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ విడుదలై ప్రేక్షకుల్లో బాగా ఆసక్తిని పెంచింది. ఇప్పటివరకు తెలుగులో తాను నటించిన సినిమాలకు తానే డబ్బింగ్ చెప్పకునే అనుపమ పరమేశ్వరన్, తొలిసారి సింగర్గా మారింది. 'బటర్ ఫ్లై' సినిమాలో ఓ పాట పాడింది. మరి ఓటీటీలో రాబోతున్న ఈ సినిమాతో అనుపమ ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో చూడాలి.