ప్రభాస్‌ను కలిసే అవకాశం

ABN , First Publish Date - 2022-03-09T03:15:07+05:30 IST

గ్లోబల్ స్టార్ ప్రభాస్‌ని నేరుగా కలవాలని ఆశపడేవారి కోసం ‘రాధేశ్యామ్’ చిత్ర టీమ్ ఓ అవకాశాన్ని కల్పించింది. ప్రభాస్, పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపొందిన పాన్ ఇండియన్ లవ్ స్టోరీ ‘రాధే శ్యామ్’. మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా..

ప్రభాస్‌ను కలిసే అవకాశం

గ్లోబల్ స్టార్ ప్రభాస్‌ని నేరుగా కలవాలని ఆశపడేవారి కోసం ‘రాధేశ్యామ్’ చిత్ర టీమ్ ఓ అవకాశాన్ని కల్పించింది. ప్రభాస్, పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపొందిన పాన్ ఇండియన్ లవ్ స్టోరీ ‘రాధే శ్యామ్’. మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా విడుదలకాబోతోన్న ఈ చిత్రంపై ఎటువంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ అంచనాలను మరింత పెంచేందుకు మేకర్స్ ఓ వినూత్న కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రభాస్ అభిమానుల కోసం మార్చ్ 8న రాధే‌శ్యామ్ సినిమాకు సంబంధించిన NFT‌ని లాంచ్ చేశారు. ఈ కలెక్షన్‌లో ప్రభాస్ డిజిటల్ ఆటోగ్రాఫ్, 3డి యానిమేటెడ్ డిజిటల్ ఆర్ట్‌తో పాటు ఎక్స్‌క్లూజివ్ 3డి యానిమేటెడ్ పిక్చర్స్ కూడా ఉండబోతున్నాయి. సినిమాలో ప్రభాస్ నడిపిన కారుకు సంబంధించిన 3డి యానిమేటెడ్ NFT కూడా ఇందులో ఉండబోతున్నాయి. వీటిని మంగళవారం అభిమానుల కోసం అందుబాటులోకి తెచ్చారు. ప్రభాస్ లెగసీ కంటిన్యూ చేయడానికి అభిమానులకు డిజిటల్ సేకరణలకు ఇది మంచి అవకాశంగా నిలిచింది. ఈ డిజిటల్ కలెక్షన్‌లో విజేతగా నిలిచిన 100 మంది లక్కీ విన్నర్స్ నేరుగా ప్రభాస్‌ను కలిసే అవకాశం కూడా అందుకోనున్నారు. అంటే ఈ NFTలు ఎవరు ఎక్కువగా కొనుగోలు చేస్తే వాళ్లకు తమకు ఇష్టమైన స్టార్‌ను కలిసే అవకాశం మరింత ఎక్కువగా ఉండబోతుంది. సినిమా విడుదలకు ముందు ఇంతకంటే పెద్ద బహుమతి అభిమానులకు మరొకటి ఉండదేమో..?


ప్రభాస్ తన కెరీర్‌లోనే మొదటిసారి జ్యోతిష్కుడిగా నటించిన ‘రాధేశ్యామ్’ చిత్రానికి బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ వాయిస్ ఓవర్ అందించారు. ఇటలీలోని అద్భుతమైన విజువల్స్.. అత్యద్భుతమైన మేకింగ్.. స్పెషల్ ఎఫెక్ట్స్.. హైదరాబాద్, జార్జియాలో తెరకెక్కించిన సన్నివేశాలు సినిమాకు హైలైట్ కానున్నాయని మేకర్స్ చెబుతున్నారు. టి సిరీస్, గుల్షన్ కుమార్ సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని యువీ క్రియేషన్స్ బ్యానర్‌పై భూషణ్ కుమార్, వంశీ, ప్రమోద్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించారు.






Updated Date - 2022-03-09T03:15:07+05:30 IST