బ్రిట్నీ చెబుతానంటోన్న ‘దెయ్యం కథ‘! హత్యకు గురైన ఓ అమ్మాయి వ్యథ!

ABN , First Publish Date - 2021-10-09T23:07:43+05:30 IST

ఓ అందమైన అమ్మాయి. ఆమెని ఎవరో దారుణంగా హత్య చేశారు. ఇప్పుడామె దెయ్యంగా మారింది. ఈ లోకానికి కాక, పరలోకానికి కాక మధ్యలో ఉండిపోయింది. బాధ, నొప్పితో సతమతం అవుతోంది. మరి వాట్ నెక్ట్స్?

బ్రిట్నీ చెబుతానంటోన్న ‘దెయ్యం కథ‘! హత్యకు గురైన ఓ అమ్మాయి వ్యథ!

ఓ అందమైన అమ్మాయి. ఆమెని ఎవరో దారుణంగా హత్య చేశారు. ఇప్పుడామె దెయ్యంగా మారింది. ఈ లోకానికి కాక, పరలోకానికి కాక మధ్యలో ఉండిపోయింది. బాధ, నొప్పితో సతమతం అవుతోంది. మరి వాట్ నెక్ట్స్? అదే తన బుక్‌లో రాయబోతున్నానని బ్రిట్నీ స్పియర్స్ ప్రకటించింది. 


తన తాజా పుస్తకం గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో వివరించిన బ్రిట్నీ...  ‘‘ఆమె మనస్ఫూర్తిగా నమ్మేందుకు తనకంటూ ఎవరూ లేరు. చివరకు, ఆమె తిరిగి ఈ ప్రపంచంలోకి వచ్చేందుకు దారిని వెదుక్కుంటుంది. తనని చంపిన వార్ని మళ్లీ కలవాలని సంకల్పిస్తుంది!’’ అని చెప్పింది. 


పాప్ సింగర్‌గా ఫేమస్ అయిన బ్రిట్నీ రచయిత్రిగా రంగంలోకి దిగటమే ఒక ఆశ్చర్యం అయితే, ఆమె చెబుతోన్న దెయ్యం కథ మరింతగా కలకలం రేపుతోంది. ఎందుకంటే, ఆమె ఈ మధ్యే కోర్టు ఆదేశాలతో తండ్రి నియంత్రణ నుంచీ బయట పడింది. బ్రిట్నీ తండ్రి ఎన్నో ఏళ్లుగా తనకి సంరక్షకుడుగా ఉంటూ అనేక ఇబ్బందులకు గురి చేసేవాడు. గంటల తరబడి పని చేయించటమే కాక వారంలో ఒక్క సెలవు కూడా తీసుకోనిచ్చేవాడు కాదు. కనీసం ఆమె రూమ్‌కి డోర్ కూడా ఉండేది కాదట. బ్రిట్నీకి అసలు ప్రైవెసీ అంటూ ఏదీ లేకుండా చేశాడు ఆమె తండ్రి. మొబైల్, కార్ లాంటివి కూడా ఇచ్చేవాడు కాదట. బ్రిట్నీ ఆదాయం, ఆస్తిపాస్తులు అన్నీ ఆయన నియంత్రణలోనే ఉండేవి. దాంతో కోర్టును ఆశ్రయించిన 39 ఏళ్ల బ్రిట్నీ స్పియర్స్‌కి,  కొన్ని రోజుల క్రితం ఉపశమనం లభించింది. న్యాయస్థానం ఆమె తండ్రి పెత్తనం ఇక పై కొనసాగకూడదని తీర్పునిచ్చింది.


నిజ జీవితంలో ఎట్టకేలకు స్వేచ్ఛ పొందిన క్రేజీ పాప్ సింగర్ ఇప్పుడు ‘ఓ అమ్మాయి ఆత్మ‘ గురించి కథ రాస్తాను అనటంతో అందరి దృష్టి అటువైపే మళ్లింది...   

Updated Date - 2021-10-09T23:07:43+05:30 IST