Brahmastra: నాలుగు నిమిషాల్లోనే థియేటర్ ఫుల్
ABN , First Publish Date - 2022-09-07T20:47:55+05:30 IST
బాలీవుడ్ ఫిల్మ్మేకర్ కరణ్ జోహార్ (Karan Johar) నిర్మించిన సినిమా ‘బ్రహ్మాస్త్ర పార్ట్-1: శివ’ (Brahmastra Part One: Shiva). బీ టౌన్ హిస్టరీలోనే అత్యధిక బడ్జెట్తో ఈ చిత్రం నిర్మితమైంది. ధర్మ
బాలీవుడ్ ఫిల్మ్మేకర్ కరణ్ జోహార్ (Karan Johar) నిర్మించిన సినిమా ‘బ్రహ్మాస్త్ర పార్ట్-1: శివ’ (Brahmastra Part One: Shiva). బీ టౌన్ హిస్టరీలోనే అత్యధిక బడ్జెట్తో ఈ చిత్రం నిర్మితమైంది. ధర్మ ప్రొడక్షన్స్, ఫాక్స్స్టార్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. ఈ మూవీలో ఆలియా భట్ (Alia Bhatt), రణ్బీర్ కపూర్ (Ranbir Kapoor) హీరో, హీరోయిన్లుగా నటించారు. అయాన్ ముఖర్జీ (Ayan Mukerji) దర్శకత్వం వహించాడు. ఈ మూవీ పాన్ ఇండియాగా రూపొందింది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో సెప్టెంబర్ 9న విడుదల కానుంది. ‘బ్రహ్మాస్త్ర’ పై మంచి బజ్ ఉంది. ఈ నేపథ్యంలో మేకర్స్ క్రేజ్ని క్యాష్ చేసుకునే పనిలో పడ్డారు. సినిమా విడుదలకు ఒక రోజు ముందు సెప్టెంబర్ 8న స్క్రినింగ్ను ఏర్పాటు చేయగా నాలుగు నిమిషాల్లోనే థియేటర్ ఫుల్ అయింది.
ముంబైలోని పీవీఆర్ సినిమాస్కు చెందిన ఒబెరాయ్ మాల్, గోరేగావ్ ఈస్ట్లో ఈ స్క్రీనింగ్ను ఏర్పాటు చేశారు. ఈ షోకు రణ్బీర్ కపూర్, ఆలియా భట్, అయాన్ ముఖర్జీ హాజరు కాబోతున్నట్టు ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలిపారు. ఈ 3డీ షో రాత్రి 7.30గంటలకు మొదలు కాబోతున్నట్టు పీవీఆర్ ప్రకటించింది. టిక్కెట్ బుకింగ్స్ ఒపెనింగ్ చేయగా నాలుగు నిమిషాల్లోనే థియేటర్ ఫుల్ అయింది. ఈ మల్టీప్లెక్స్లో 315 సీట్లు ఉన్నాయి. ఒక గంటలోగా టిక్కెట్స్ అన్ని అమ్ముడవుతాయని పీవీఆర్ సంస్థ భావించింది. కానీ, నిర్వహకుల అంచనాలను తలకిందులు చేస్తూ నాలుగు నిమిషాల్లోనే టిక్కెట్స్ అన్ని అమ్ముడవ్వడం విశేషం. ‘బ్రహ్మాస్త్ర’ ను మూడు భాగాలుగా రూపొందిస్తున్నారు. మొదటి భాగం ప్రపంచవ్యాప్తంగా అత్యధిక స్క్రీన్స్లో సెప్టెంబర్ 9న విడుదల కానుంది. పురాణాల్లోని అస్త్రాలను ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని నిర్మించారు. దక్షిణాది భాషల్లో దర్శకధీరుడు ఎస్ఎస్. రాజమౌళి ఈ మూవీని సమర్పిస్తున్నాడు. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, రణ్బీర్ కపూర్, ఆలియా భట్, మౌనిరాయ్, అక్కినేని నాగార్జున తదితరులు కీలక పాత్రలు పోషించారు.