విధి మా ఆశలను తుంచేసింది.. ఎమోషనలైన బోనీ కపూర్

ABN , First Publish Date - 2022-02-25T21:28:31+05:30 IST

అందాల తార శ్రీదేవి ఫిబ్రవరి 24, 2018న దుబాయ్‌లో హఠాన్మరణం చెందింది. దాంతో ఆమె కుటుంబ సభ్యులతో పాటు భారత సినీ పరిశ్రమలోని ఎందరో అభిమానులు బాధపడ్డారు...

విధి మా ఆశలను తుంచేసింది.. ఎమోషనలైన బోనీ కపూర్

అందాల తార శ్రీదేవి ఫిబ్రవరి 24, 2018న దుబాయ్‌లో హఠాన్మరణం చెందింది. దాంతో ఆమె కుటుంబ సభ్యులతో పాటు భారత సినీ పరిశ్రమలోని ఎందరో అభిమానులు బాధపడ్డారు. ఈ తార కూతుర్లు జాన్వీ కపూర్, ఖుషీ కపూర్, భర్త బోనీ కపూరైతే దర్భం వచ్చినప్పుడల్లా ఆ నటిపై ప్రేమని బహిరంగంగా వ్యక్తపరుస్తూ ఉన్నారు. శ్రీదేవి మూడో వర్థంతి సందర్భంగా భర్త బోనీ కపూర్ తాజాగా సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.


బోనీ భార్య శ్రీదేవితో కలిసి వెనిస్ నగరంలో దిగిన ఫొటోని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. దానికి.. ‘మేము సెప్టెంబర్ 7, 2008న మిలన్ నుంచి వెనిస్‌కు వెళ్లాం. ఆ సిటీ మాకెంతో నచ్చింది. అయితే అక్కడ కొన్ని గంటలు మాత్రమే ఉండగలిగా. దీంతో ఎక్కువ రోజులు అక్కడే ఉండేలా ప్లాన్ చేసుకొని మళ్లీ వెనిస్‌కి వెళ్లాలని నిర్ణయించుకున్నాం. కానీ విధి మా ప్రణాళికలు, ఆశలను తుంచేసింది’ అని ఎమోషనల్‌గా ఆయన రాసుకొచ్చారు. దీంతో ఈ పిక్స్ ఎంతోమంది శ్రీదేవి అభిమానులు స్పందించారు. అందుకే బాధపడొద్దని, ఆ తార ఖచ్చితంగా మీతోనే ఉంటుందని ఓదార్చుతూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.



Updated Date - 2022-02-25T21:28:31+05:30 IST