Pushpa అంటూ రష్మికతో ఉన్న ఫొటోను పోస్ట్ చేసిన Amitabh.. రచ్చ రచ్చ చేసిన నెటిజన్లు..!
ABN , First Publish Date - 2022-03-31T22:23:36+05:30 IST
అల్లు అర్జున్ హీరోగా నటించిన సినిమా ‘పుష్ప’. నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియా రష్మిక మందన్న
అల్లు అర్జున్ హీరోగా నటించిన సినిమా ‘పుష్ప’. నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియా రష్మిక మందన్న హీరోయిన్గా నటించింది. లెక్కల మాస్టారు సుకుమార్ తెరకెక్కించాడు. పాన్ ఇండియాగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. బాలీవుడ్లో రూ.100కోట్లకు పైగా కలెక్షన్లను సాధించి రికార్డులు సృష్టించింది. ఈ మూవీలో రష్మిక నటనకు బాలీవుడ్ షెహన్ షా అమితాబ్ బచ్చన్ కూడా ఫిదా అయ్యాడు. తాజాగా బిగ్ బీ ఆమెతో ఫొటో తీసుకున్నాడు. సోషల్ మీడియా వేదికగా ఆ పిక్ను అభిమానులతో పంచుకున్నాడు. దీంతో ఆ ఫొటో నెట్టింట హల్చల్ చేస్తుంది.
ప్రస్తుతం రష్మిక మందన్న ‘గుడ్ బై’ అనే చిత్రంలో నటిస్తుంది. ఈ సినిమాలో బిగ్ బీ అమితాబ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్లో భాగంగా బిగ్ బీ, రష్మికలపై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఈ సందర్భంగానే మెగాస్టార్ ఆమెతో ఫొటో తీసుకున్నాడు. ఆ పిక్ను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసి ‘పుష్ప’ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. బిగ్ బీ పోస్ట్ పెట్టిన కాసేపటికే ఆ ఫొటో నెట్టింట వైరల్గా మారింది. రష్మిక అభిమానులందరూ విపరీతంగా ఆ ఫొటోను షేర్ చేయడం మొదలుపెట్టారు. కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ‘‘రష్మిక అదృష్టవంతురాలు. ఎందుకంటే ఆమెకు మీతో పనిచేసే అవకాశం వచ్చింది’’ అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ‘‘పుష్ప కాదు సార్ శ్రీవల్లీ’’ అంటూ మరో నెటిజన్ రిప్లై ఇచ్చాడు. ‘‘మీ హావభావాలు అద్భుతంగా ఉన్నాయి సార్’’ అని ఓ సోషల్ మీడియా యూజర్ స్పందించాడు. ‘గుడ్ బై’ చిత్రానికి వికాస్ భల్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఏక్తా కపూర్ నిర్మిస్తుంది.