అల్లు అరవింద్ ఆహా ప్లాట్‌ఫామ్‌ లాగానే.. బాలీవుడ్‌లో ఓటీటీని లాంచ్ చేయబోతున్న బడా నిర్మాత..

ABN , First Publish Date - 2021-11-13T01:06:56+05:30 IST

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ అయిన అల్లు అరవింద్ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లోకి గతంలోనే ఎంట్రీ ఇచ్చాడు. ఆహా పేరుతో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ను లాంచ్ చేశాడు.

అల్లు అరవింద్ ఆహా ప్లాట్‌ఫామ్‌ లాగానే.. బాలీవుడ్‌లో ఓటీటీని లాంచ్ చేయబోతున్న బడా నిర్మాత..

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ అయిన అల్లు అరవింద్ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లోకి గతంలోనే ఎంట్రీ ఇచ్చాడు. ఆహా పేరుతో  ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ను లాంచ్ చేశాడు. ఆ ప్లాట్‌ఫామ్ వేదికగా సినిమాలు, వెబ్ సిరీస్‌లు రూపొందిస్తున్నాడు. తాజాగా అల్లుఅరవింద్ బాటలోనే నడుస్తూ ఒక బాలీవుడ్ బడా నిర్మాత ఓటీటీ వేదికను లాంచ్ చేయనున్నాడని బీ టౌన్‌లో టాక్ వినిపిస్తోంది. 


థగ్స్ ఆఫ్ హిందుస్థాన్, దూమ్ సిరీస్‌కు  సంబంధించిన  చిత్రాలను నిర్మించిన సంస్థ యశ్ రాజ్ ఫిలింస్. ఇండియాలోనే బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌస్‌గా ఈ సంస్థకు పేరు ఉంది. ఆ సంస్థ ఇప్పటికే సినిమాలపై దాదాపుగా రూ.1000కోట్లకు పైగా వెచ్చించింది. ఆ సంస్థ మరో కొత్త బిజినెస్‌లోకి ఎంట్రీ ఇవ్వనుంది. భారత్‌లో ఓటీటీ మార్కెట్‌కు డిమాండ్ బాగుండటంతో ఆ వ్యాపారాన్ని ప్రారంభించాలని ఆలోచిస్తున్నట్టు బీ టౌన్ మీడియా వెల్లడిస్తోంది. ఆ సంస్థ అధినేత అయిన ఆదిత్య చోప్రా రూ. 500కోట్లతో కొత్తగా ఓటీటీ ప్లాట్‌‌ఫామ్‌ను లాంచ్ చేయాలని ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఆ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌కు వైఆర్‌ఎఫ్ ఎంటర్ టైన్‌మెంట్‌గా పేరు పెట్టనున్నట్టు సమాచారం. 


‘‘ భారత్‌లో డిజిటల్ కంటెంట్‌కు మంచి డిమాండ్ ఉంది. అందువల్ల ఆదిత్య చోప్రా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించాలని అనుకుంటున్నారు. ప్రపంచ స్థాయి నాణ్యత ప్రమాణాలతో ఈ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఉంటుంది. కొత్త రకం కథలను ఓటీటీ వేదికగా నిర్మిస్తారు. గత రెండు ఏళ్లుగా ఓటీటీని ప్రారంభిచాలని ప్రణాళికలు రచిస్తున్నారు. కొంత సమయం వేచి చూడండి. ఆ సంస్థ త్వరలోనే ఒక ప్రకటన చేస్తుంది ’’ అని ఆదిత్య చోప్రాతో సన్నిహితంగా మెలిగే  ఒక వ్యక్తి చెప్పారు. అమెజాన్, నెట్ ఫ్లిక్స్ వంటి ప్రపంచ స్థాయి ఓటీటీలకు ఆదిత్య చోప్రా లాంచ్ చోయబోయే ఆన్‌లైన్ వేదిక పోటీ ఇస్తుందా అనేది తెలియాలంటే  మాత్రం కొంతకాలం వేచి చూడాల్సిందే.

Updated Date - 2021-11-13T01:06:56+05:30 IST