పొరుగింటి మహిళపై పరువు నష్టం దావా వేసిన బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ భార్య

ABN , First Publish Date - 2022-03-26T02:04:57+05:30 IST

‘హమ్ తుమ్’, ‘ఫనా’ వంటి హిట్ సినిమాలను తెరకెక్కించి బాలీవుడ్ టాప్ డైరెక్టర్‌గా

పొరుగింటి మహిళపై పరువు నష్టం దావా వేసిన బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ భార్య

‘హమ్ తుమ్’, ‘ఫనా’ వంటి హిట్ సినిమాలను తెరకెక్కించి బాలీవుడ్ టాప్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నాడు కునాల్ కోహ్లీ. అతడి భార్య రవీనా తాజాగా తమ పొరుగున ఉండే ఓ మహిళపై భారీ మొత్తానికి పరువు నష్టం దావా వేసింది. వివరాల్లోకి వెళ్లితే.. 


ముంబై పాలీ హిల్‌లోని కోజీ హోమ్‌లో సినీ సెలబ్రెటీలు నివసిస్తుంటారు. ఈ భవనం మీనా కుమారి దత్త పుత్రుడైన తాజ్దార్ అమ్రోహికీ చెందినది. దీపికా పదుకొణే గతంలో ఇక్కడే నివసించేది. ఈ బిల్డింగ్‌లోని సీ బ్లాక్‌లో కునాల్ కోహ్లీ తన భార్య రవీనాతో కలసి నివసిస్తున్నాడు. డీ బ్లాక్‌లో ప్రీతీ మోత్వానీ అనే ఆవిడ ఉంటుంది. కోజీ హోమ్ ట్రెజరర్‌గా రవీనా బాధ్యతలు నిర్వహిస్తుంది. గతేడాది ప్రీతీ మోత్వానీకీ చెందిన భూ వివాదాన్ని కోర్టు బయట సెటిల్ చేయాలని బిల్డింగ్ యాజమని తాజ్దార్ అమ్రోహి ట్రెజరర్‌కు చెప్పాడు. వివాద పరిష్కారం కోసం రూ.1 కోటిని రవీనాకు ఇచ్చాడు. ఈ డబ్బుల విషయంలోనే రవీనా, ప్రీతీకీ మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో పలు సందర్భాల్లో మాటల యుద్ధానికి కూడా దిగారు. ఈ దూషణాలు కూడా శ్రుతి మించాయి. ట్రెజరర్‌గా తన అధికారాన్ని రవీనా దుర్వినియోగం చేసిందని ప్రీతీ ఆరోపించింది. దీంతో మనస్థాపనికి గురైన రవీనా ఆమెకు లీగల్ నోటీసులు పంపించింది. ప్రీతీపై రూ.10కోట్లకు పరువు నష్టం దావా వేసింది. అధికారికంగా క్షమాపణలు కూడా చెప్పాలని ఆ పిటిషన్‌లో కోరింది.

Updated Date - 2022-03-26T02:04:57+05:30 IST