ఓటీటీలోకి రాబోతున్న బిగ్ బీ ‘ఝుండ్’.. స్ట్రీమింగ్ ఎక్కడ, ఎప్పటినుంచంటే..?
ABN , First Publish Date - 2022-04-21T20:52:13+05:30 IST
బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటించిన సినిమా ‘ఝుండ్’. నాగపూర్కు చెందిన స్పోర్ట్స్ టీచర్ విజయ్ బార్సే జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని రూపొందించారు.
బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటించిన సినిమా ‘ఝుండ్’. నాగపూర్కు చెందిన స్పోర్ట్స్ టీచర్ విజయ్ బార్సే జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని రూపొందించారు. ‘సైరాట్’ తో జాతీయ అవార్డును పొందిన నాగరాజ్ మంజులే ‘ఝుండ్’ కు దర్శకత్వం వహించాడు. మార్చి 4న విడుదలైన ఈ సినిమా అభిమానుల మన్ననలు పొందడంతో పాటు విమర్శకుల ప్రశంసలు సొంతం చేసుకుంది. ఈ చిత్రం త్వరలోనే ఓటీటీలోకి రాబోతుంది.
బయోగ్రాఫికల్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన ‘ఝుండ్’ మే 6 నుంచి ‘జీ-5’ లో స్ట్రీమింగ్ కానుంది. బాలీవుడ్ షెహన్ షా అమితాబ్ ఈ చిత్రంలో విజయ్ బార్సే పాత్రను పోషించాడు. ఆకాష్ తోషార్, రింకు రాజ్ గురు కీలక పాత్రలు పోషించారు. టీ సిరీస్, తాండవ్ ఫిలింస్ ఎంటర్ టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు ఈ సినిమాను నిర్మించాయి. ఓటీటీ ప్లాట్ఫాంలోకి రాబోతుండటంతో నాగరాజ్ మంజులే మీడియాతో మాట్లాడాడు. ‘‘థియేటర్స్లో ఈ సినిమాను ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారు. ‘జీ-5’లో ఈ చిత్రం అందుబాటులోకి రానుండటంతో ప్రజలు అనేక సార్లు చూస్తారనుకుంటున్నాను’’ అని నాగరాజ్ మంజులే తెలిపాడు.