ప్రమోషన్ కార్యక్రమాల్లో సరికొత్త ఎత్తుగడను అనుసరిస్తున్న Prithviraj బృందం.. Dhoom 3 బాటలోనే నడుస్తూ..
ABN , First Publish Date - 2022-05-19T21:29:49+05:30 IST
హిట్, ప్లాప్లతో సంబంధం లేకుండా బాలీవుడ్లో బడా సినిమాలను నిర్మించే సంస్థ యశ్ రాజ్ ఫిలిమ్స్ (Yash Raj Films). ఆ సంస్థ నుంచి వస్తున్న తాజా చిత్రం ‘పృథ్వీరాజ్’ (Prithviraj). అక్షయ్ కుమార్
హిట్, ప్లాప్లతో సంబంధం లేకుండా బాలీవుడ్లో బడా సినిమాలను నిర్మించే సంస్థ యశ్ రాజ్ ఫిలిమ్స్ (Yash Raj Films). ఆ సంస్థ నుంచి వస్తున్న తాజా చిత్రం ‘పృథ్వీరాజ్’ (Prithviraj). అక్షయ్ కుమార్ (Akshay Kumar), మానుషి చిల్లర్(Manushi Chhillar) హీరో, హీరోయిన్లుగా నటించారు. చంద్ర ప్రకాష్ ద్వివేది (Chandraprakash Dwivedi) దర్శకత్వం వహించాడు. ఢిల్లీని పరిపాలించిన పృథ్వీరాజ్ చౌహాన్ (Prithviraj Chauhan) జీవిత చరిత్రను ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ మూవీ జూన్ 3న విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేసింది. ప్రమోషన్ ఎత్తుగడలో భాగంగా కొత్త వ్యూహాన్ని అనుసరిస్తుంది.
‘పృథ్వీరాజ్’ సినిమాను భారీ బడ్జెట్తో నిర్మించారు. ఈ సీజన్లో విడుదల కాబోతున్న బిగ్ ఈవెంట్ ఫిలిం ఇదే. అందువల్ల ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలను మరింత పెంచే ఆలోచనలో యశ్ రాజ్ ఫిలిమ్స్ ఉంది. అందులో భాగంగానే ప్రచార కార్యక్రమాల్లో సరికొత్త ఎత్తుగడను అనుసరిస్తుంది. బాలీవుడ్లో టీజర్, ట్రైలర్ అనంతరం ఫుల్ సాంగ్స్ను విడుదల చేస్తారు. కానీ, ‘పృథ్వీరాజ్’ సినిమాకు సంబంధించిన వరకు పూర్తి పాటలను విడుదల చేయకూడదని చిత్ర బృందం నిర్ణయించింది. అందుకు బదులుగా పాటలకు సంబంధించి టీజర్ను విడుదల చేస్తుంది. ఈ వ్యూహంతో చిత్రంపై అంచనాలు మరింత పెరగుతాయని యశ్ రాజ్ ఫిలిమ్స్(YRF)( వైఆర్ఎఫ్) భావిస్తుంది. గతంలో ఆమిర్ ఖాన్ హీరోగా నటించిన ‘ధూమ్-3’ (Dhoom 3) మూవీకి ఇదే పంథాను వైఆర్ఎఫ్ అవలభించింది.