పాత ఇంటిని అమ్మేసిన అమితాబ్ బచ్చన్.. ధరెంతో తెలిస్తే షాకే..

ABN , First Publish Date - 2022-02-03T19:26:28+05:30 IST

బాలీవుడ్‌లో అమితాబ్‌‌బచ్చన్‌కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయనతో పాటు ఆయన లగ్జరీయస్ బంగ్లాల కారణంగా కూడా వార్తల్లో నిలుస్తుంటారు...

పాత ఇంటిని అమ్మేసిన అమితాబ్ బచ్చన్.. ధరెంతో తెలిస్తే షాకే..

బాలీవుడ్‌లో అమితాబ్‌‌బచ్చన్‌కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయనతో పాటు ఆయన లగ్జరీయస్ బంగ్లాల కారణంగా కూడా వార్తల్లో నిలుస్తుంటారు. అమితాబ్ తాజాగా మరోసారి సౌత్ ఢిల్లీలోని గుల్‌మెహర్ పార్క్ బంగ్లాని అమ్మి న్యూస్‌లో నిలిచారు. ఎందుకంటే ఆ బంగ్లాని అమ్మిన ధర రూ.23 కోట్లు మరి. అది కూడా 1980కి ముందే కట్టి కూలిపోయే దశలో ఉన్న పాత బంగ్లాకి అంత ధర రావడం విశేషమనే చెప్పాలి.


అమితాబ్ బచ్చన్ తల్లి తేజి బచ్చన్ పేరు మీద రిజిస్టర్ అయ్యి ఉన్న ఆ బంగ్లా పేరు ‘సోపాన్’. అది రెండు అంతస్తులుగా 418 స్వ్కేర్ ఫీట్లు ఉంటుంది. ముంబైకి షిప్ట్ అవ్వకముందు బిగ్‌బీ ఈ ఇంట్లోనే ఉండేవారు. తర్వాత ఈ మెగాస్టార్ తల్లిదండ్రులు ఉండేవారు. కొంతకాలం తర్వాత వారు కూడా ముంబైకి వెళ్లిపోగా.. కొన్ని సంవత్సరాలుగా ఈ ఇంట్లో ఎవరూ ఉండట్లేదు. దీంతో అమితాబ్ అమ్మకానికి పెట్టగా నెజన్ గ్రూప్ సంస్థల సీఈవో అవ్నీ బదేర్ కొనుకున్నారు. 


ఈ బంగ్లా గురించి అవ్నీ మాట్లాడుతూ.. ‘ఎన్నో సంవత్సరాలుగా ఈ ఏరియాలో ఉంటున్నాం. ఇక్కడే మరో ప్రాపర్టీ కోసం చూస్తున్న తరుణంలో ఈ ఆఫర్ వచ్చింది. దీంతో వెంటనే కొనాలని ఫిక్స్ అయ్యాం. ఇది పాత బిల్డింగ్ అందుకే దీన్ని పడగొట్టి మా అవసరాలు, అభిరుచులకు అనుగుణంగా కొత్తది కడతాం’ అని తెలిపారు. మార్కెట్ ధరలకి అనుగుణంగా ఈ బంగ్లాని అమ్మినట్లు ‘సోపాన్’ని అమ్మిన లగ్జరియస్ రియల్ ఎస్టేట్ బ్రోకర్ ప్రదీప్ తెలిపాడు.

Updated Date - 2022-02-03T19:26:28+05:30 IST