భర్త పోయిన బాధే లేకుండా కొడుకు Ranbir పెళ్లిలో డాన్సులేంటంటూ ట్రోల్స్.. దిమ్మతిరిగే జవాబిచ్చిన Neetu Kapoor
ABN , First Publish Date - 2022-05-11T21:13:04+05:30 IST
బాలీవుడ్ సెలబ్రిటీ లవ్బర్డ్స్ ఆలియా భట్ (Alia bhatt), రణ్బీర్ కపూర్ (Ranbir kapoor) ల పెళ్లి ఏప్రిల్ 14న వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే
బాలీవుడ్ సెలబ్రిటీ లవ్బర్డ్స్ ఆలియా భట్ (Alia bhatt), రణ్బీర్ కపూర్ (Ranbir kapoor)ల పెళ్లి ఏప్రిల్ 14న వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ వివాహనికీ బాలీవుడ్ నుంచి అతిరథ మహారథులు హాజరయ్యారు. ఈ వేడుకలో రణ్బీర్ తల్లి నీతూ కపూర్ డ్యాన్స్ చేసింది. పెళ్లి అనంతరం ఆ ఫొటోలు, వీడియోలు బయటకు వచ్చాయి. దీంతో నెటిజన్స్ ఆమెను ట్రోలింగ్ చేశారు. ఈ ట్రోలింగ్పై తాజాగా నీతూ కపూర్ స్పందించింది.
భర్త పోయిన బాధే లేకుండా కొడుకు పెళ్లిలో డాన్సులేంటంటూ ఓ వ్యక్తి ట్రోలింగ్కు పాల్పడ్డాడని నీతూ కపూర్ చెప్పింది. దీంతో ఆ వ్యక్తిని బ్లాక్ చేశానని పేర్కొంది. ‘‘విధవ లాగా ఎల్లప్పుడు ఏడుస్తూ ఉండాలని సమాజంలోని కొంతమంది కోరుకుంటారు. అటువంటి వారిని నేను బ్లాక్ చేస్తాను. నా భర్త రిషి కపూర్ను నేను ఎప్పుడు మర్చిపోను. అతడు ఎప్పుడు నా మనసులోనే ఉంటాడు. నా పిల్లల జీవితాల్లో వారిని చూసుకుంటాను. అందరు ఒకే విధంగా బాధను వ్యక్తం చేయరు. కొందరు ఏడుస్తారు. మరికొందరు ఏడ్వరు’’ అని నీతూ కపూర్ స్పష్టం చేసింది. ప్రతిరోజు రిషి కపూర్ను వేర్వేరు మార్గాల్లో గుర్తు చేసుకుంటామని ఆమె వెల్లడించింది. ఇప్పటికీ అందరం కలసి భోజనం చేసేటప్పుడు సగం సమయాన్ని రిషి గురించే చర్చించుకుంటామని తెలిపింది. రణ్బీర్ కపూర్ ఫోన్లో ఇప్పటికీ స్క్రీన్ సేవర్గా రిషి ఫొటోనే ఉంటుందని చెప్పింది.
రిషి కపూర్, నీతూ కపూర్ మొదటిసారిగా ‘జెహ్రీలా ఇన్సాన్’ (Zehreela Insaan) సినిమా సెట్లో కలుసుకున్నారు. ఈ చిత్రం 1980లో విడుదలైంది. రిషి, నీతు కలసి ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ (Amar Akbar Anthony), ‘ఖేల్ ఖేల్ మే’ (Khel Khel Mein), ‘కబీ కబీ’ (Kabhie Kabhie) సినిమాల్లో జోడీగా నటించారు. రిషి కపూర్ 2020 ఏప్రిల్లో మరణించాడు.