సిద్దార్థ్ మల్హోత్రాతో, కియారా అడ్వాణీ బ్రేకప్ చేసుకుందా..?

ABN , First Publish Date - 2022-04-23T20:58:13+05:30 IST

ఇషాన్ ఖట్టర్, అనన్య పాండేల బ్రేకప్ వార్తలను మరవకముందే బాలీవుడ్‌లో మరో జంట తమ బంధానికి ముగింపు పలికింది. హీరోయిన్ కియారా అడ్వాణీ, హీరో సిద్దార్థ్ మల్హోత్రాతో

సిద్దార్థ్ మల్హోత్రాతో, కియారా అడ్వాణీ బ్రేకప్ చేసుకుందా..?

ఇషాన్ ఖట్టర్, అనన్య పాండేల బ్రేకప్ వార్తలను మరవకముందే బాలీవుడ్‌లో మరో జంట తమ బంధానికి ముగింపు పలికింది. హీరోయిన్ కియారా అడ్వాణీ, హీరో సిద్దార్థ్ మల్హోత్రాతో గత కొన్నేళ్లుగా డేటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ లవ్‌బర్డ్స్ త్వరలోనే పెళ్లి చేసుకుంటారని అందరూ అనుకున్నారు. ఏమైందో తెలియదు కానీ, తాజాగా వీరు బ్రేకప్ చేసుకున్నారని బాలీవుడ్ మీడియా తెలుపుతోంది.  


సిద్దార్థ్ మల్హోత్రా, కియారా అడ్వాణీ ‘షేర్ షా’ సినిమాలో జోడిగా నటించారు. ఈ మూవీ షూటింగ్ సమయంలోనే వీరికి పరిచయం అయింది. ఆ పరిచయం కాస్తా ప్రేమకు దారి తీసింది. దీంతో గత కొన్నేళ్లుగా డేటింగ్ చేయడం మొదలుపెట్టారు. కానీ, తాము ప్రేమించుకుంటున్నట్టు ఈ జంట ఎప్పుడూ అధికారికంగా చెప్పలేదు. సిద్దార్థ్, కియారా త్వరలోనే పెళ్లి చేసుకుంటారని అందరూ అనుకున్నారు. కానీ, వీరు మాత్రం అభిమానులకు చేదు వార్తను అందిస్తూ బ్రేకప్ చేసుకున్నారు. ‘‘సిద్దార్థ్ మల్హోత్రా, కియారా అడ్వాణీ ఒకరిని మరొకరు కలుసుకోవడం మానేశారు. ఈ జంట విడిపోయింది. విడిపోవడానికి గల కారణాలు వారికే తెలియాలి’’ అని ఈ లవ్‌బర్డ్స్‌తో సన్ని‌హితంగా మెలిగే వ్యక్తి ఓ తెలిపారు. 

Updated Date - 2022-04-23T20:58:13+05:30 IST