నువ్వు ఏడిచే రోజులు వచ్చేశాయి.. కరణ్ జోహార్‌పై విరుచుకుపడిన కంగన..

ABN , First Publish Date - 2022-04-02T01:29:28+05:30 IST

బాలీవుడ్‌లో వివాదస్పద వ్యాఖ్యలు చేస్తూ తరచూ వార్తల్లో నిలిచే నటి కంగనా రనౌత్

నువ్వు ఏడిచే రోజులు వచ్చేశాయి.. కరణ్ జోహార్‌పై విరుచుకుపడిన కంగన..

బాలీవుడ్‌లో వివాదస్పద వ్యాఖ్యలు చేస్తూ తరచూ వార్తల్లో నిలిచే నటి కంగనా రనౌత్. సెలబ్రిటీలపై విమర్శలు గుప్పిస్తూ ఉంటుంది. నెపోటిజంపై గొంతెత్తి పోరాడుతుంటుంది. సోషల్ మీడియా వేదికగా కుండబద్దలు కొట్టినట్టు తన అభిప్రాయాలను వెల్లడిస్తుంటుంది. బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగన మరోసారి కరణ్ జోహార్‌పై ఇన్ డైరెక్ట్‌గా విరుచుకుపడింది. సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. 


అందాల భామ కంగనా రనౌత్ ‘లాక్ అప్’ అనే రియాలిటీ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తుంది. ఎమ్‌ఎక్స్ ప్లేయర్‌లో ఈ షో ప్రసారం అవుతోంది. తాజాగా ఈ షో వ్యూస్ 200మిలియన్లను దాటాయి. ఈ నేపథ్యంలో కరణ్ జోహార్‌ను లక్ష్యంగా చేసుకుని ఆమె పోస్ట్ పెట్టింది.‘‘ ..‘లాక్ అప్ షో’ను వీక్షించేవారి సంఖ్య 200మిలియన్లు దాటింది. ‘పాపా జో’ అతడి సైన్యం రహస్యంగా దాక్కొని ఏడుస్తుంది. వారు ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ అవి ఫలించలేదు. తర్వాత ఏం జరగబోతుందో వేచి చూడండి. ‘పాపా జో’ నువ్వు ఏడిచే రోజులు వచ్చాయి’’ అంటూ కంగన పోస్ట్ పెట్టింది. ‘పాపా జో’ అనే మాట కరణ్‌ను ఉద్దేశించే ఆమె అన్నట్టు తెలుస్తోంది. బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌కు, కరణ్ జోహార్‌తో విభేదాలు గత కొంతకాలం నుంచీ కొనసాగుతున్నాయి. కరణ్ హోస్ట్ చేసిన ‘కాఫీ విత్ కరణ్’ షోకు గతంలో సైఫ్ అలీఖాన్‌తో కలసి కంగన హాజరైంది. ఈ షోలో భాగంగా నెపోటిజానికి సూత్రధారి అంటూ కరణ్‌పై మండిపడింది. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి.



Updated Date - 2022-04-02T01:29:28+05:30 IST