కోట్లల్లో పారితోషికం పెంచేసిన షాహిద్ కపూర్
ABN , First Publish Date - 2022-03-02T00:47:28+05:30 IST
విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన ‘అర్జున్ రెడ్డి’ సినిమా
విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన ‘అర్జున్ రెడ్డి’ సినిమా టాలీవుడ్లో సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని బాలీవుడ్లో ‘కబీర్ సింగ్’ పేరుతో రీమేక్ చేశారు. ఈ మూవీలో చాక్లెట్ బాయ్ షాహిద్ కపూర్ హీరోగా నటించాడు. ఈ సినిమాతో అతడు బాక్సాఫీస్ రికార్డులను తిరగరాశాడు. దీంతో అతడు మరో టాలీవుడ్ హిట్ చిత్రానికి ఓకే చెప్పాడు. ‘జెర్సీ’ ని అదే పేరుతో బాలీవుడ్లో రీమేక్ చేశాడు. ఈ చిత్రం గతేడాది డిసెంబర్ 31న విడుదల కావాల్సి ఉన్నా కరోనా ఆంక్షలతో వాయిదా పడింది. ‘జెర్సీ’కి షాహిద్ దాదాపుగా రూ.31కోట్లు పారితోషికంగా తీసుకున్నాడని తెలుస్తోంది. కానీ, మూవీ రిలీజ్ కాకపోవడంతో రెమ్యునరేషన్ తగ్గించుకోవడానికి సిద్ధపడ్డాడు.
షాహిద్ గతంలో నటించిన ‘పద్మావత్’, ‘కబీర్ సింగ్’ సినిమాలు మంచి విజయం సాధించాయి. దీంతో అతడు రెమ్యునరేషన్ను పెంచేస్తున్నట్టు తెలుస్తోంది. ‘జెర్సీ’కి తీసుకున్న పారితోషికం కంటే 25శాతం అదనంగా కావాలని డిమాండ్ చేస్తున్నాడని సమాచారం. షాహిద్ ప్రస్తుతం అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రానికి అతడు దాదాపుగా రూ.38కోట్ల పారితోషికం తీసుకున్నాడని బీ టౌన్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ‘కబీర్ సింగ్’ చిత్రం షాహిద్కు గేమ్ ఛేంజర్లా నిలిచింది. ఫలితంగా అతడు ఎంత పారితోషికం డిమాండ్ చేసినా నిర్మాతలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు.