చరిత్రను తిరగరాస్తానంటున్న తాప్సీ

ABN , First Publish Date - 2022-03-21T23:03:21+05:30 IST

బాలీవుడ్‌లో వరుసపెట్టి కథానాయిక ప్రాధాన్యం ఉన్న సినిమాలు

చరిత్రను తిరగరాస్తానంటున్న తాప్సీ

బాలీవుడ్‌లో వరుసపెట్టి కథానాయిక ప్రాధాన్యం ఉన్న సినిమాలు చేస్తున్న నటి తాప్సీ పన్ను. ‘పింక్’, ‘సాండ్ కీ అంఖ్’, ‘తప్పడ్’, ‘రష్మీ రాకెట్’ వంటి సినిమాల్లో నటించి అభిమానులను అలరించింది. ఈ మధ్యనే ‘లూప్ ల పేట’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీలో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. 


స్టార్ హీరోయిన్ తాప్సీ టైటిల్ రోల్‌లో నటించిన చిత్రం ‘శభాష్ మిథు’. అనేక ప్రపంచ రికార్డులను నెలకొల్పిన ఇండియన్ క్రికెటర్ మిథాలీ రాజ్ జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఈ సినిమా తెరకెక్కింది. ‘శభాష్ మిథు’ టీజర్‌ను తాప్సీ సోషల్ మీడియాలో నేడు విడుదల చేసింది. ‘‘జెంటిల్‌మేన్ స్పోర్ట్ అయిన క్రికెట్‌లో చరిత్రను తిరగరాయడానికి ఆమె ఇబ్బంది పడలేదు. ప్రపంచానికి తన కథను ఆమె చాటిచెప్పింది’’ అని తాప్సీ ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొంది. రవిశాస్త్రీ వాయిస్ ఓవర్‌తో ఈ టీజర్ ప్రారంభం అయింది. టీజర్‌లో ‘‘టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే డబుల్ సెంచరీ సాధించిన యంగెస్ట్ క్రికెటర్, 23ఏళ్లుగా స్పోర్ట్ ఆడుతున్న క్రీడాకారిణీ’’ అని తాప్సీని ప్రేక్షకులకు పరిచయం చేశారు.


‘శభాష్ మిథు’ కోసం తాప్సీ క్రికెట్ ప్రాక్టీస్ చేసింది. నెట్స్‌లో విపరీతంగా శ్రమించింది. ఈ చిత్రానికి శ్రీజిత్ ముఖర్జీ దర్శకత్వం వహించాడు. వయకాం 18స్టూడియోస్ నిర్మించింది. మిథాలీ రాజ్ క్రికెట్ ప్రయాణాన్ని రియల్‌గా చూపించడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ స్టేడియాల్లో ఈ సినిమాను చిత్రీకరించారు. ఈ మూవీని త్వరలోనే విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.



Updated Date - 2022-03-21T23:03:21+05:30 IST