అందమైన వైవాహిక జీవితానికి అదే ముఖ్యమంటోన్న మిసెస్ Sonam

ABN , First Publish Date - 2021-11-14T00:25:54+05:30 IST

నోబెల్ బహుమతి గ్రహీత మలాలా యూసుఫ్‌జాయ్‌కి బాలీవుడ్ నటీమణుల శుభాకాంక్షలు కొనసాగుతున్నాయి. ఈ మధ్యే ఆమె బ్రిటన్‌లో అసర్ మలిక్‌ను పెళ్లాడిన విషయం తెలిసిందే. అయితే, మలాలా నిఖా తరువాత బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా ...

అందమైన వైవాహిక జీవితానికి అదే ముఖ్యమంటోన్న మిసెస్ Sonam

నోబెల్ బహుమతి గ్రహీత మలాలా యూసుఫ్‌జాయ్‌కి బాలీవుడ్ నటీమణుల శుభాకాంక్షలు కొనసాగుతున్నాయి. ఈ మధ్యే ఆమె బ్రిటన్‌లో అసర్ మలిక్‌ను పెళ్లాడిన విషయం తెలిసిందే. అయితే, మలాలా నిఖా తరువాత బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా తనకి ట్విట్టర్‌లో బెస్ట్ విషెస్ తెలిపింది. కొత్త దంపతులకి ‘‘సుఖ, సంతోషాలు’’ కలగాలంటూ ఆకాంక్షించింది. 


ప్రియాంక చోప్రా తరువాత తాజాగా సోనమ్ కపూర్ కూడా మలాలాకి వివాహ శుభాకాంక్షలు తెలియజేసింది. అయితే, సింపుల్‌గా విషెస్ చెప్పకుండా... మిసెస్ సోనమ్ అహుజా... తన అనుభవాన్ని కూడా రంగరించి సందేశాన్ని అందించింది. ‘‘కంగ్రాచ్యులేషన్స్ మలాలా!’’ అన్న ఆమె ‘‘నిజమైన భాగస్వామ్యం... భార్యాభర్తలు ఇద్దరి మధ్యా ఏర్పడితే వైవాహిక జీవితం అందంగా ఉంటుంది’’ అని చెప్పింది. 2018లో ఆనంద్ అహుజాను పెళ్లాడిన 36 ఏళ్ల సోనమ్ ప్రస్తుతం హ్యాపీగా మ్యారీడ్ లైఫ్ కొనసాగిస్తోంది.   

Updated Date - 2021-11-14T00:25:54+05:30 IST