విజువల్ ఎఫెక్ట్స్ బిజినెస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ బ్యూటీ

ABN , First Publish Date - 2022-04-19T00:40:34+05:30 IST

బాలీవుడ్ నటి శిల్పాశెట్టి విజువల్ ఎఫెక్ట్స్(వీఎఫ్ఎక్స్) బిజినెస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ‘ఎస్‌విఎస్’ పేరుతో వీఎఫ్‌ఎక్స్ స్టూడియో లాంచ్ చేసింది. ముంబై, అంధేరి వెస్ట్‌లో వీఎఫ్‌ఎక్స్ కార్యాలయాన్ని తెరిచింది.

విజువల్ ఎఫెక్ట్స్ బిజినెస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ బ్యూటీ

బాలీవుడ్ నటి శిల్పాశెట్టి విజువల్ ఎఫెక్ట్స్(వీఎఫ్ఎక్స్) బిజినెస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ‘ఎస్‌విఎస్’ పేరుతో వీఎఫ్‌ఎక్స్ స్టూడియో లాంచ్ చేసింది. ముంబై, అంధేరి వెస్ట్‌లో వీఎఫ్‌ఎక్స్ కార్యాలయాన్ని తెరిచింది. విజువల్ ఎఫెక్ట్స్‌లో సుదీర్ఘ అనుభవం గల సందీప్ మానేను మెనేజింగ్ డైరెక్టర్‌గా నియమించింది. సందీప్ గతంలో ‘బాహుబలి-2’, ‘బాజీరావ్ మస్తానీ’, ‘పద్మావత్’, ‘సింబా’, ‘దంగల్’, ‘హౌస్‌పూల్-3’, ‘గోల్‌మాల్ ఎగైన్’ తదితర ప్రాజెక్టులకు వీఎఫ్‌ఎక్స్ సేవలు అందించాడు. ప్రైమ్ ఫోకస్, ఎన్‌వై వీఎఫ్‌క్స్ వాలా, అనిబ్రెయిన్ వంటి సంస్థల్లో పనిచేసిన అనుభవం అతడికి ఉంది. 


కొత్త బిజినెస్‌లోకి ఎంట్రీ ఇస్తున్న సందర్భంగా శిల్పాశెట్టి తన ఆనందాన్ని అందరితో పంచుకుంది. ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటించింది. సినిమాల్లో భాగమైన వీఎఫ్ఎక్స్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని ఆమె చెప్పింది. వీఎఫ్‌ఎక్స్‌తో ఒక సినిమా రూపు రేఖలే మార్చవచ్చని  తెలిపింది. ప్రొడక్షన్ హౌస్‌లకు ప్రపంచస్థాయి నాణ్యతతో సేవలు అందించడమే తమ లక్ష్యమని వివరించింది. వీఎఫ్‌ఎక్స్ ఇండస్ట్రీలోని కొత్త టెక్నాలజీపై తమ కంపెనీ దృష్టి సారిస్తుందని మెనేజింగ్ డైరెక్టర్ సందీప్ మానే తెలిపాడు.



Updated Date - 2022-04-19T00:40:34+05:30 IST