‘ఇండియన్ పోలీస్ ఫోర్స్‌’తో ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్న బాలీవుడ్ నటి

ABN , First Publish Date - 2022-04-23T21:58:18+05:30 IST

స్టార్ డైరెక్టర్ రోహిత్ శెట్టి, ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్‌తో కలసి ‘ఇండియన్ పోలీస్ ఫోర్స్’ పేరుతో ఓ వెబ్

‘ఇండియన్ పోలీస్ ఫోర్స్‌’తో ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్న బాలీవుడ్ నటి

స్టార్ డైరెక్టర్ రోహిత్ శెట్టి, ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్‌తో కలసి ‘ఇండియన్ పోలీస్ ఫోర్స్’ పేరుతో ఓ వెబ్ సిరీస్‌ను నిర్మిస్తున్నాడు. ఈ షోను భారీ స్థాయి యాక్షన్ ఎంటర్ టైనర్‌గా రూపొందించనున్నారు. ఈ వెబ్‌సిరీస్‌లో సిద్దార్థ్ మల్హోత్రా కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ షో ద్వారానే బాలీవుడ్ నటి శిల్పా శెట్టి  ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వనుంది. 


ఈ సందర్భంగా సోషల్ మీడియాలో శిల్పా శెట్టి ఓ పోస్ట్ పెట్టింది. తన ఫస్ట్‌లుక్‌ను అభిమానులతో పంచుకుంది. ‘‘ఓటీటీ ప్లాట్‌ఫాంలోకి మొదటి సారి ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమయ్యాను. యాక్షన్ కింగ్ రోహిత్ శెట్టి కాప్ యూనివర్స్‌లోకి చేరడానికి ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాను’’ అని శిల్పా శెట్టి చెప్పింది. ఈ షోని రూపొందించడం ద్వారా భారత్‌లో స్ట్రీమింగ్ అయ్యే వెబ్ సిరీస్‌ల్లో ఓ బెంచ్ మార్క్ సెట్ చేయాలని అమెజాన్ ప్రైమ్ నిర్ణయించుకుందని బాలీవుడ్ మీడియా తెలుపుతోంది. పోలీస్ కథలను రూపొందించడంలో రోహిత్ శెట్టికి మంచి పేరు ఉంది. అతడి నుంచి అభిమానులు ఆశించే అంశాలన్ని ఈ వెబ్ సిరీస్‌లో ఉంటాయని సమాచారం. ‘ఇండియన్ పోలీస్ ఫోర్స్’ వెబ్‌సిరీస్ తనకు చాలా ప్రత్యేకమని రోహిత్ శెట్టి చెప్పాడు. అనేక ఏళ్ల పాటు ఈ స్క్రిఫ్ట్‌పై పనిచేశానని పేర్కొన్నాడు. అమెజాన్ ప్రైమ్‌తో కలసి పనిచేయడం సంతోషంగా ఉందని తెలిపాడు.  



Updated Date - 2022-04-23T21:58:18+05:30 IST