అతడితో ఫొటో దిగలేకపోయినందుకు నా మనసు ముక్కలైంది: పూజా హెగ్డే

ABN , First Publish Date - 2022-05-02T01:57:50+05:30 IST

దక్షిణాదితో పాటు బాలీవుడ్‌లోను వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్న నటి పూజా హెగ్డే. అశుతోష్ గోవారికర్ దర్శకత్వం వహించిన ‘మొహంజోదారో’ సినిమాతో పూజ బీ టౌన్‌కు ఎంట్రీ ఇచ్చింది

అతడితో ఫొటో దిగలేకపోయినందుకు నా మనసు ముక్కలైంది: పూజా హెగ్డే

దక్షిణాదితో పాటు బాలీవుడ్‌లోను వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్న నటి పూజా హెగ్డే. అశుతోష్ గోవారికర్ దర్శకత్వం వహించిన ‘మొహంజోదారో’ సినిమాతో పూజ బీ టౌన్‌కు ఎంట్రీ ఇచ్చింది. స్టార్ హీరో హృతిక్ రోషన్ పక్కన హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రాన్ని సింధు నాగరికతను ఆధారంగా చేసుకుని తెరకెక్కించారు. తనకు చిన్నతనంలో హృతిక్‌పై క్రష్ ఉండేదని పూజ చెప్పుకొచ్చింది. అతడు హీరోగా నటించిన ‘కోయి మిల్ గయా’ ప్రీమియర్‌కు కూడా హాజరయ్యానని పేర్కొంది. అప్పుడు హృతిక్‌తో ఫొటో దిగేందుకు తనకు అవకాశం రాలేదని అందువల్ల మనసు ముక్కలైందని తెలిపింది. గతానికీ వెళ్లి ఈ విషయాలను గుర్తు చేసుకుంటే చాలా నవ్వొస్తుందని ఆమె స్పష్టం చేసింది. 


‘కోయి మిల్ గయా’ సినిమా సైన్స్ ఫిక్షన్‌గా రూపొందింది. ఈ చిత్రంలో హృతిక్ రోషన్, ప్రితీ జింటా హీరో, హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీ 2003లో విడుదలైంది. ఆ సినిమా రిలీజ్ అయ్యే నాటికీ పూజకు 12ఏళ్లు. చదువు పూర్తయిన అనంతరం పూజా హెగ్డే మోడలింగ్‌ను కెరీర్‌గా ఎంచుకుంది. యాడ్‌లు చేయడం ప్రారంభించింది. ఓ యాడ్‌లో ఆమెను చూసిన అశుతోష్ గోవారికర్ ‘మొహంజోదారో’ ‌లో హీరోయిన్‌గా ఛాన్స్ ఇచ్చారు. ఈ మూవీ 2016లో విడుదలైంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పరాజయం కావడంతో అంతగా అవకాశాలు రాలేదు. కొన్నాళ్లకు తెలుగు ఇండస్ట్రీ నుంచి పిలుపు రావడంతో ఇక్కడ అగ్ర కథానాయకులందరి పక్కన నటించి స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది.

Updated Date - 2022-05-02T01:57:50+05:30 IST