ఆ నటి బయోపిక్ కోసం కృతి సనన్ని సంప్రదించారా..?
ABN , First Publish Date - 2022-03-27T02:13:35+05:30 IST
ఎటువంటి అండదండలు లేకుండా సినీ ఇండస్ట్రీకీ వచ్చి స్వ శక్తితో ఎదిగిన
ఎటువంటి అండదండలు లేకుండా సినీ ఇండస్ట్రీకీ వచ్చి స్వ శక్తితో ఎదిగిన అందాల భామ కృతి సనన్. ‘హీరో పంటీ’ చిత్రంతో నటిగా మారింది. ‘వన్: నేనొక్కడినే’, ‘దోచేయ్’ వంటి సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకులకు చేరువైంది. బాలీవుడ్ నుంచి కృతీకీ వరుసగా అవకాశాలు వస్తుండటంతో ముంబైలోనే స్థిరపడింది. తాజాగా కృతి సనన్కు సంబంధించి ఓ వార్త నెట్టింట తెగ హల్చల్ చేస్తుంది. ఓ స్టార్ హీరోయిన్ బయోపిక్ కోసం కృతిని సంప్రదించారని బీ టౌన్ మీడియా కోడై కూస్తోంది.
లెజెండరీ నటి మీనా కుమారి బయోపిక్ కోసం కృతిని సంప్రదించారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ బయోపిక్ను టీ సిరీస్ రూపొందించనుంది. ఈ చిత్రంలో టైటిల్ రోల్ కోసం కృతితో మేకర్స్ చర్చలు జరిపారని తెలుస్తోంది. ఈ ఆఫర్తో ఆమె సంతోషంలో మునిగిపోయిందని సమాచారం. కానీ, తన అంగీకారాన్ని ఆమె ఇంతవరకు తెలపలేదట. ఇక కెరీర్ విషయానికి వస్తే.. కృతి సనన్ తాజాగా ‘బచ్చన్ పాండే’ సినిమాలో నటించింది.తమిళంలో సూపర్ డూపర్ హిట్టయిన ‘జిగర్తాండ’ సినిమాకు రీమేక్గా ఇది రూపొందింది.. ఇదే ‘జిగర్తాండ’ సినిమా తెలుగులో ‘గద్దలకొండ గణేష్’గా రీమేక్ అయింది. ‘బచ్చన్ పాండే’లో అక్షయ్ కుమార్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, అర్షద్ వార్సీ కీలక పాత్రలు పోషించారు. ప్రభాస్ హీరోగా తెరకెక్కిన భారీ బడ్జెట్ మూవీ ‘ఆదిపురుష్’లోను కృతి సనన్ నటిస్తుంది.