హీరోయిన్‌ని ‘ఆంటీ’ అని పిలిచిన కియారా అడ్వాణీ..

ABN , First Publish Date - 2022-03-20T01:16:48+05:30 IST

అందం, అభినయంతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తున్న నటి కియారా అడ్వాణీ

హీరోయిన్‌ని ‘ఆంటీ’ అని పిలిచిన కియారా అడ్వాణీ..

అందం, అభినయంతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తున్న నటి కియారా అడ్వాణీ. ‘ఫగ్లీ’ అనే కామెడీ చిత్రంతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ‘భరత్ అనే నేను’ సినిమాతో టాలీవుడ్‌ ప్రేక్షకులకు చేరువైందీ అందాల భామ. ‘ఎమ్ ఎస్ ధోనీ: ది అన్‌టోల్డ్ స్టోరీ’, ‘కబీర్ సింగ్’, ‘లక్ష్మీ’ వంటి హిట్ చిత్రాల్లో నటించింది. ఈ మధ్య ‘షేర్ షా’ చిత్రంలో కనిపించి అభిమానులను అలరించింది. తాజాగా ఆమె మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూలో ఆసక్తికర కబుర్లను అభిమానులతో పంచుకుంది. 


బాలీవుడ్ బ్యూటీ కియారా అడ్వాణీ నిన్నటి తరం హీరోయిన్ జుహీ చావ్లానీ ప్రశంసలతో ముంచెత్తింది. తన తండ్రి జగ్‌దీప్ అడ్వాణీకి హీరోయిన్ జుహీచావ్లా చిన్ననాటి స్నేహితురాలని చెప్పింది. ఇంటర్వ్యూ సమయంలో జుహీని ‘ఆంటీ’ అని సంబోధించింది. అలా అన్నందుకు ఆమె తనను చంపేయదనుకుంటున్నాని కూడా సరదాగా కామెంట్ చేసింది. ఇక అలనాటి నటుడు అశోక్ కుమార్ తనకు బంధువు అవుతాడని వెల్లడించింది కియారా. చిన్నప్పుడు తాను సినిమా కథలను ఎప్పుడు కూడా వినలేదని ఆమె స్పష్టం చేసింది. ‘‘జుహీ ఆంటీ చాలా మంచిది. ఆమెను పెద్ద నటిగా నేను ఎప్పుడు చూడలేదు. నా తల్లిదండ్రులకు స్నేహితురాలిగా మాత్రమే నాకు తెలుసు. మేం బర్త్ డే పార్టీల్లో కలుసుకునేవాళ్లం. ఆమె పిల్లలతో కూడా నేను ఆడుకున్నాను’’ అని కియారా అడ్వాణీ తెలిపింది.

Updated Date - 2022-03-20T01:16:48+05:30 IST