లగ్జరీ కారుతో ఫోజిచ్చిన Kiara Advani.. వైరల్గా మారిన ఫొటోలు..
ABN , First Publish Date - 2021-12-15T21:29:13+05:30 IST
బాలీవుడ్తోొ పాటు టాలీవుడ్లో సినిమాలు చేస్తున్న నటి కియారా అడ్వాణీ. భరత్ అనే నేను సినిమాలో మహేశ్ బాబు సరసన నటించి
బాలీవుడ్తో పాటు టాలీవుడ్లో సినిమాలు చేస్తున్న నటి కియారా అడ్వాణీ. భరత్ అనే నేను సినిమాలో మహేశ్ బాబు సరసన నటించి టాలీవుడ్కు ఎంట్రీ ఇచ్చింది. ఆమె లగ్జరీ బ్రాండ్ కారును కొనుగోలు చేసింది. ఆమె దగ్గర బీఎమ్డబ్ల్యూ ఎక్స్-5, మెర్సిడెస్ బెంజ్ ఈ క్లాస్, బీఎమ్డబ్ల్యూ 530డీ బ్రాండ్లకు చెందిన కార్లు ఇప్పటికే ఉన్నాయి. తాజాగా మరో విలాసవంతమైన బ్రాండ్కు చెందిన కారును ఆమె కొనుగోలు చేయడం విశేషం. ప్రస్తుతం ఆ ఫొటోలు నెట్టింట్లో వైరల్గా మారాయి. నెటిజన్లు ఆ ఫొటోలను తెగ షేర్ చేస్తున్నారు.
ఆడి సంస్థకు చెందిన కొత్త కారును ఆమె కొనుగోలు చేసింది. ఆడి ఏ8 లగ్జరీ సెడాన్తో ఆమె ఫోజులు ఇచ్చింది. భారత మార్కెట్లో ఆడి ఈ బ్రాండ్ కారును 2020లో విడుదల చేసింది. ఢిల్లీ ఎక్స్ షోరూంలో ఆ కారు ప్రారంభ ధర రూ.1.56కోట్లుగా ఉన్నట్లు తెలుస్తోంది. కియారా అడ్వాణీ కారుతో తీసుకున్న ఫొటోలను ఆడి ఇండియా సంస్థ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది. ‘‘ఆడి కారును నడపడానికి కియారా అడ్వాణీని స్వాగతిస్తున్నాం ’’ అని ఆ సంస్థ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.