ఘనంగా బాలీవుడ్ బ్యూటీ పెళ్లి.. వైరల్ అయిన పిక్స్..

ABN , First Publish Date - 2022-02-06T01:57:22+05:30 IST

టీవీ నటిగా పరిచయమై అనంతరం సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సుందరి కరిష్మా తన్నా

ఘనంగా బాలీవుడ్ బ్యూటీ పెళ్లి.. వైరల్ అయిన పిక్స్..

టీవీ నటిగా పరిచయమై అనంతరం సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సుందరి కరిష్మా తన్నా. ‘దోస్తీ: ఫ్రెండ్స్ ఫరెవర్’, ‘గ్రాండ్ మస్తీ’, ‘సంజు’ వంటి చిత్రాల్లో నటించింది. తాజాగా ఆమె బిజినెస్‌మాన్ వరుణ్ బంగేరాని వివాహమాడింది. ఆ పెళ్లికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. నెటిజన్లు అందరు ఆ ఫొటోలను విపరీతంగా షేర్ చేస్తున్నారు. వాటి కింద కామెంట్లు కూడా రాస్తున్నారు. ఆ ఫొటోల్లో నవ దంపతులు తళ తళ మెరిసిపోతున్నారు. 

  

కరిష్మా తన్నా తన మెహందీ వేడుకకు సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లోని అభిమానులతో  పంచుకుంది. పెళ్లికి ముందు జరిగే వేడుకలకు సంబంధించిన అనేక ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. కరిష్మా అనేక టెలివిజన్ షోలను కూడా హోస్ట్ చేసింది. ‘ఖత్రోంకే ఖిలాడీ-10’ రియాలిటీ షో విన్నర్‌గా నిలిచింది. ‘బిగ్ బాస్-8’లో పాల్గొన్నప్పుడు ఉపెన్ పటేల్ అనే వ్యక్తి ఆమెకు పరిచయమయ్యాడు. కరిష్మా అతడితో డేటింగ్ కూడా చేసింది. నిశ్చితార్థం కూడా జరిగింది. ఏమైందో తెలియదు కానీ 2016లో వారు తమ బంధానికి స్వస్తి పలికారు. అనంతరం వరుణ్ బంగేరాని ప్రేమించిన కరిష్మా ఇప్పుడు మిస్ నుంచీ మిసెస్‌గా ప్రమోట్ అయింది...



Updated Date - 2022-02-06T01:57:22+05:30 IST