హోలీ రోజు కొడుకుతో కలసి ఇసుక గూళ్లను నిర్మించిన కరీనా కపూర్
ABN , First Publish Date - 2022-03-19T01:44:46+05:30 IST
బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ రెండు దశాబ్దాలుగా సినీ ఇండస్ట్రీలో
బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ రెండు దశాబ్దాలుగా సినీ ఇండస్ట్రీలో కెరీర్ను కొనసాగిస్తోంది. ‘త్రీ ఇడియట్స్’, ‘గోల్ మాల్-3’, ‘బాడీ గార్డ్’, ‘బజరంగీ భాయిజాన్’, ‘ఉడ్తా పంజాబ్’ వంటి చిత్రాల్లో నటించి అభిమానులను అలరించింది. తాజాగా కరీన హాలీడేను ఎంజాయ్ చేయడానికి మాల్దీవులకు వెళ్లింది. ఆ ఫొటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది.
కరీనా కపూర్ తన పిల్లలతో కలసి వేకేషన్ కోసం మాల్దీవులకు వెళ్లింది. ఈ ట్రిప్లో కరీన సోదరి కరిష్మా కపూర్ కూడా ఆమెకు జతయింది. కరీన హోలీ వేడుకలను మాల్దీవుల్లోనే జరుపుకొంది. హోలీ రోజు బీచ్లో తన కొడుకు జహంగీర్తో కలసి ఆమె సరదాగా ఆడుకుంది. తల్లీకొడుకులిద్దరూ ఇసుక గూళ్లను నిర్మించారు. ఈ సందర్భంగా తీసుకున్న పిక్ను ఇన్స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకుంది. ఆమె ఈ ఫొటోకు క్యాప్షన్ కూడా ఇచ్చింది. ‘‘హోలీ రోజు మేం ఇసుక గూళ్లను నిర్మించాం. హ్యాపీ హోలీ’’ అంటూ కరీన రాసుకొచ్చింది. ఈ ఫొటోకు బాలీవుడ్ సెలబ్రెటీ డిజైనర్ మనీశ్ మల్హోత్రా హార్ట్ ఎమోజీలతో కామెంట్ చేశాడు.
బాలీవుడ్లో కెరీర్ విషయానికి వస్తే.. కరీనా కపూర్ ‘లాల్ సింగ్ చద్దా’ సినిమాలో నటిస్తుంది. ఈ చిత్రంలో ఆమిర్ ఖాన్ హీరోగా నటించాడు. ఈ ఏడాది ఆగస్టు 11న ఈ చిత్రం విడుదల కాబోతోంది. త్వరలోనే ఆమె ఓటీటీలోకి కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. సుజయ్ ఘోష్ దర్శకత్వంలో ఆమె నటించనుంది.