కంగనా కరోనా వేళ నీకిది తగునా.. వైరల్ వీడియోపై ట్రోలింగ్
ABN , First Publish Date - 2022-01-08T17:30:17+05:30 IST
మంచి నటన కౌశలంతోనే కాకుండా దేశంలో జరిగే వివిధ అంశాలపై బెరుకు లేకుండా మాట్లాడుతూ.. పెద్ద కాంట్రవర్సీల ద్వారా సైతం వార్తల్లో నిలుస్తుంటుంది కంగనా రనౌత్..
మంచి నటన కౌశలంతోనే కాకుండా దేశంలో జరిగే వివిధ అంశాలపై బెరుకు లేకుండా మాట్లాడుతూ.. పెద్ద కాంట్రవర్సీల ద్వారా సైతం వార్తల్లో నిలుస్తుంటుంది కంగనా రనౌత్. అందుకే ఆమె యాక్టింగ్కి ఉన్న పెద్ద ఫ్యాన్ బేస్ ఎంజాయ్ చేస్తూనే.. అదే సమయంలో సోషల్ మీడియాలో ట్రోలింగ్కి సైతం గురవుతూ ఉంటుంది.
ఇటీవలే ఓ పార్టీలో పాల్గొంది కంగనా. దీనికి సంబంధించిన వీడియోని సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్ సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు. అందులో కెమెరాలకి ప్యాస్ట్రీ కేకుతో కెమెరాలకి ఫోజులిచ్చింది ఈ బ్యూటీ. అయితే ఆ కేకుని నోటి దాకా తీసుకొచ్చిన ఈ భామ పిక్స్ తీసుకున్నాక దాన్ని ప్లేటులోని ఇతర కేకులతో కలిసి పోయేలా పెట్టేసింది. దీంతో దీనిపై విపరీతంగా ట్రోల్ చేశారు నెటిజనులు.
‘కరోనా వ్యాప్తి చేస్తోంది’ అంటూ ఒకరు.. ‘ఎంత అపరిశుభ్రంగా వ్యవహరిస్తోంది’ అని మరొకరు.. ‘కరోనా వ్యాపిస్తున్న సమయంలో కేక్ని నోటి దాకా తీసుకొచ్చి.. మళ్లీ అక్కడే పెట్టింది.. ఎంత అపరిశుభ్రంగా ఉంది’ అంటూ ఇంకొకరు.. మరో నెటిజన్ అయితే ‘తినని దానివి కేకుని ఎందుకు అంతా దగ్గరగా తీసుకెళ్లవు. మళ్లీ ఎందుకు ట్రేలో పెట్టేశావు.
అలాంటి ఆహారాన్ని మరొకరు ఎలా తింటారు. ఇంకోసారి ఎదైనా నోటి దాక తీసుకెళ్లే ఖచ్చితంగా తీను. అలా పెట్టిన దాన్ని ఎవరైన తింటే వాళ్లకి నీ నోటిలోని క్రీములు వెళ్లే అవకాశం ఉంద’ని పెద్ద కామెంట్ని రాసుకొచ్చాడు.
అయితే ఇటీవలే ఏ.ఎల్.విజయ్ దర్శకత్వంలో కంగనా నటించిన తలైవి సినిమాతో మంచి హిట్ని సాధించింది. కాగా ప్రస్తుతం ‘తేజ్’, ‘ధకాడ్’ సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.