ఎక్కువగా శత్రువులను సంపాదించుకున్నా.. ఈ దెబ్బకి అందరి నోళ్లు మూత పడతాయి: Kangana Ranaut

ABN , First Publish Date - 2021-11-09T14:43:14+05:30 IST

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తన సినిమాలతో మాత్రమే కాకుండా కాంట్రవర్సీలతో కూడా వార్తల్లో నిలుస్తుందనే విషయం తెలిసిందే. అందుకే అందరూ ఈ బ్యూటీని ఫైర్‌బ్రాండ్ అంటూ ఉంటారు.

ఎక్కువగా శత్రువులను సంపాదించుకున్నా.. ఈ దెబ్బకి అందరి నోళ్లు మూత పడతాయి: Kangana Ranaut

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తన సినిమాలతో మాత్రమే కాకుండా కాంట్రవర్సీలతో కూడా వార్తల్లో నిలుస్తుందనే విషయం తెలిసిందే. అందుకే అందరూ ఈ బ్యూటీని ఫైర్‌బ్రాండ్ అంటూ ఉంటారు. తాజాగా పద్మశ్రీ అందుకున్న ఈ భామ తన అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.

ఓ నటిగా ఎన్నో అవార్డులు గెలుచుకున్నప్పటికీ పద్మశ్రీ వల్ల దేశం ఆదర్శవంతమైన వ్యక్తిగా గుర్తింపు పొందడం ఎంతో సంతోషాన్నిచ్చిందని కంగనా తెలిపింది. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఆ వీడియోలో ఈ భామ మాట్లాడుతూ..‘అవార్డు ఇచ్చినందుకు ధన్యవాదాలు. చిన్న వయస్సులోనే కెరీర్ ప్రారంభించినప్పటికీ విజయాన్ని రుచి చూడడానికి నాకు 8-10 సంవత్సరాలు పట్టింది. అయితే విజయం నా సొంతమయ్యే సమయానికి నేను దానిని ఆనందించే స్థితిలో లేను.


ఎందుకంటే అప్పటికే ఇతర సమస్యల్లో ఇరుక్కుపోయాను. నేను ఫెయిర్‌నెస్ ప్రోడక్ట్‌లు, ఐటెమ్ నంబర్‌లు, పాపులర్ మేల్ లీడ్‌ సినిమాలు, ప్రొడక్షన్ హౌస్‌లతో సినిమాల్లో పనిచేయడం వంటి వాటికి దూరంగా ఉన్నాను. చిత్ర పరిశ్రమలో ప్రవేశించినప్పటి నుంచి నేను డబ్బు కంటే ఎక్కువ మంది శత్రువులను సంపాదించాను. ఈ అవార్డుతో అందరి నోళ్లు మూతపడతాయి’ అని ఈ బ్యూటీ చెప్పింది.



Updated Date - 2021-11-09T14:43:14+05:30 IST