వారు ఉడకబెట్టిన గుడ్లు.. అందుకే సౌత్ సినిమాలు ఆకట్టుకుంటున్నాయి: Kangana Ranaut
ABN , First Publish Date - 2022-05-16T16:25:02+05:30 IST
బాలీవుడ్ ఫైర్బ్రాండ్ కంగనా రనౌత్ బాలీవుడ్లోని నెపోటిజం, స్టార్ కిడ్స్పై తరచుగా విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే...
బాలీవుడ్ ఫైర్బ్రాండ్ కంగనా రనౌత్ బాలీవుడ్లోని నెపోటిజం, స్టార్ కిడ్స్పై తరచుగా విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నటి అలా చేసే కామెంట్స్ కొన్నిసార్లు వివాదాస్పదం కూడా అయ్యాయి. అలా కరణ్ జోహార్, అలియా భట్, హృతిక్ రోషన్ వంటి బాలీవుడ్ ప్రముఖులపై అయితే డైరెక్ట్గానే విమర్శలు చేసింది. తాజాగా మరోసారి స్టార్ కిడ్స్పై, బాలీవుడ్ సినిమాలపై కంగన ఘాటు విమర్శలు చేసింది.
కంగన నటించిన తాజా చిత్రం ‘ధాకడ్’. మే 20న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానున్న ఈ సినిమా ప్రమోషన్స్లో ఈ భామ ఫుల్ బిజీగా గడుపుతోంది. ఈ తరుణంలో జరిగిన ఓ ఇంటర్వ్యూలో సౌత్ సినిమాల సక్సెస్ గురించి మాట్లాడింది. అలాగే బాలీవుడ్ సినిమాల పై విమర్శలు చేసింది. కంగన మాట్లాడుతూ.. ‘దక్షిణాది నటులు ప్రేక్షకులతో చాలా బలంగా కనెక్ట్ అవుతారు. వారు అభిమానులు కాదు అంతకంటే ఎక్కువ. కానీ బాలీవుడ్లో స్టార్ కిడ్స్ విదేశాల్లో చదువులు పూర్తి చేస్తారు. ఇంగ్లిషులో మాట్లాడతారు. హాలీవుడ్ (Hollywood) సినిమాలు మాత్రమే చూస్తారు. కత్తులు, ఫొర్క్లతో తినడమే కాకుండా డిఫరెంట్గా మాట్లాడతారు. అలాంటి వారితో ప్రేక్షకులు ఎలా కనెక్ట్ అవుతారు. అందుకే ఆడియన్స్కి ఉడకబెట్టిన గుడ్లలాగా విచిత్రంగా కనిపిస్తారు. వారి లుక్, వారిపై అభిప్రాయం పూర్తిగా మారేలా చేస్తుంది. అలాంటి వారిని మామూలు ప్రేక్షకులు రిలేట్ చేసుకోలేరు. కానీ ఓ విషయం.. ఇక్కడ ఎవరినీ ట్రోల్ చేయాలని ఉద్దేశంతో ఈ మాటలు చెప్పట్లేదు’ అంటూ చెప్పుకొచ్చింది.
అల్లు అర్జున్ పాన్ ఇండియా మూవీ ‘పుష్ప: ది రైజ్ (Pushpa: The Rise)’ విజయం గురించి కంగన మాట్లాడుతూ.. ‘పుష్ప సినిమాలో పాత్ర చూస్తే మనకు తెలిసిన వ్యక్తిలా అనిపిస్తాడు. ప్రతి కార్మికుడు ఆ పాత్రతో కనెక్ట్ అవ్వగలుగుతాడు. ఈ జనరేషన్ బాలీవుడ్ హీరోల్లో ఎవరైనా కూలీగా కనిపించడానికి ఇష్టపడతారా?. నిజం చెప్పాలంటే ఎవరూ లేరు. దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో సంస్కృతిని, రియాలిటీని ప్రతిబించేలా సినిమాలు చేయడం ప్రతిఫలాన్ని ఇస్తోంది. వారు భవిష్యత్తులో పాశ్చాత్య దేశాల నుంచి ప్రేరణతో సినిమాలు చేయారని ఆశిస్తున్నా. మీ ప్రాంత ప్రేక్షకులకి కనెక్టు కావడానికి అది చాలా ముఖ్యం’ అని తెలిపింది.