మీ శరీరంలో ఏం జరుగుతుందో తెలుసుకోండి.. కరోనా వచ్చి తగ్గిన వాళ్లకి కంగనా రనౌత్ సలహ

ABN , First Publish Date - 2022-01-29T17:35:17+05:30 IST

ఎలాంటి బెరుకు లేకుండా తన మనసులో మాటను సూటిగా చెప్పే నటుల్లో కంగనా రనౌత్ ఒకరు. అందుకే ఈ బ్యూటీని బాలీవుడ్ జనాలు ఫైర్ ‌బ్రాండ్ అని పిలుచుకుంటూ ఉంటారు...

మీ శరీరంలో ఏం జరుగుతుందో తెలుసుకోండి.. కరోనా వచ్చి తగ్గిన వాళ్లకి కంగనా రనౌత్ సలహ

ఎలాంటి బెరుకు లేకుండా తన మనసులో మాటను సూటిగా చెప్పే నటుల్లో కంగనా రనౌత్ ఒకరు. అందుకే ఈ బ్యూటీని బాలీవుడ్ జనాలు ఫైర్ ‌బ్రాండ్ అని పిలుచుకుంటూ ఉంటారు. ఈ భామ తాజాగా కరోనా వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి సోషల్ మీడియాలో సలహాలు ఇచ్చింది.


కంగనా పెట్టిన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో.. ‘కోవిడ్ వచ్చి తగ్గిన లేదా వ్యాక్సిన్ తీసుకున్న వారందరూ దయచేసి మీ విటమిన్ డి3, బి12 స్థాయిలను చెక్ చేసుకొండి. మిగిలిన వాటిని వదిలేసి ఈ సప్లిమెంట్లను తీసుకోవడం ప్రారంభించండి. యోగా, రోజువారీ నడకలు లేదా మీరు చేసే ఇతర వ్యాయామం చేయడం ద్వారా మీ శరీరం, అవయవాలను బలోపేతం చేయడానికి ప్రయత్నించండి. దానికి ధ్యానం లేదా ప్రాణాయామాన్ని జోడించండి. పని, పరిస్థితులను తట్టుకోలేక మీ శరీరం ఇబ్బంది పడొచ్చు. అప్పటివరకూ మీ శరీరం దేనితో పోరాడుతుందో మీకు తెలియకపోవచ్చు. అందుకే మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి’ అంటూ రాసుకొచ్చింది.


నిజానికి కొన్ని నెలల క్రితం కోవిడ్ పాజిటివ్ రావడంతో కొన్ని రోజుల పాటు హోమ్ క్వారంటైన్ ఉంది. అందుకే కంగనా రనౌత్ తన తాజా పోస్ట్‌లో కోవిడ్ వచ్చి తగ్గిన తర్వాత పరిస్థితుల గురించి వివరించింది.

Updated Date - 2022-01-29T17:35:17+05:30 IST