శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ని ఆడేసుకుంటున్న నెటిజన్లు.. కారణం ఏంటంటే..
ABN , First Publish Date - 2022-04-07T19:43:53+05:30 IST
బాలీవుడ్లోనూ పాపులర్ హీరోయిన్స్లో జాన్వీ కపూర్ ఒకరు. అందులో ఎటువంటి సందేహం లేదు. అందాల తార, దివంగత నటి శ్రీదేవి..
బాలీవుడ్లోని పాపులర్ హీరోయిన్స్లో జాన్వీ కపూర్ ఒకరు. అందులో ఎటువంటి సందేహం లేదు. అందాల తార, దివంగత నటి శ్రీదేవి కూతురిగా చిత్ర పరిశ్రమకి పరిచయమై మొదటి సినిమా ‘ధడక్’తోనే మంచి హిట్ సాధించింది. అందంతోపాటు నటనతోనూ అందరి మన్ననలు పొంది తల్లికి తగ్గ తనయురాలు అనిపించుకుంది. అయితే ఈ భామ సినిమాలతోనే కాకుండా తన డ్రెస్సింగ్ సెన్స్తోనూ యువత హృదయాలను కొల్లగొడుతూ ఉంటుంది. అయితే అప్పుడప్పుడూ ఈ తార డ్రెస్సింగ్తో ట్రోలింగ్కి సైతం గురవుతూ ఉంటుంది.
తాజాగా జాన్వీ చిన్ననాటి స్నేహితులైన అనన్య పాండే, షానయ కపూర్తో కలిసి డిన్నర్కి వెళ్లింది. ఈ సందర్భంగా ఈ బ్యూటీ ఓ రెస్టారెంట్ వద్ద మీడియా కంటపడింది. దీనికి సంబంధించిన పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అందులో.. ఈ భామ బ్లూ కలర్ బ్యాక్లెస్ జంప్ సూట్ ధరించింది. అలా వీపు మొత్తం కనిపించేలా ఉండడం చాలామంది నెటిజన్లకి నచ్చలేదు. దీంతో ట్రోలింగ్ చేయడం ప్రారంభించారు.
కొందరూ జాన్వీని అమెరికన్ మోడల్ కిమ్ కర్దాషియన్తో పొలుస్తూ.. ‘ఇక్కడ కిమ్లా మారాలనుకుంటున్నావా’ అంటూ కామెంట్స్ చేయగా.. కొంచెం డీసెంట్గా దుస్తులు ధరించాలని మరికొందరూ విమర్శలు చేస్తున్నారు. కాగా.. మరోవైపు చాలా అందంగా ఉన్నావంటూ మరికొందరు నెటిజన్లు ఈ బ్యూటీపై ప్రశంసలు సైతం కురిపిస్తున్నారు.