ఫస్ట్ లాక్‌డౌన్ సమయంలో చికిత్స తీసుకున్నాను: జాక్వెలిన్ ఫెర్నాండెజ్

ABN , First Publish Date - 2022-03-13T21:24:26+05:30 IST

ఆర్థిక మోసగాడు సుఖేశ్ చంద్రశేఖర్‌తో రిలేషన్‌షిప్ నేపథ్యంలో

ఫస్ట్ లాక్‌డౌన్ సమయంలో చికిత్స తీసుకున్నాను: జాక్వెలిన్ ఫెర్నాండెజ్

ఆర్థిక మోసగాడు సుఖేశ్ చంద్రశేఖర్‌తో రిలేషన్‌షిప్ నేపథ్యంలో గతేడాది కాలంగా వార్తల్లో నిలుస్తున్న నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్. ఈ కేసులో ఆమె ఇప్పటికీ పలు ఆరోపణాలు ఎదుర్కొంటుంది. జాక్వెలిన్ తాజాగా నటించిన సినిమా ‘బచ్చన్ పాండే’.  ప్రస్తుతం ఆమె ఈ చిత్ర ప్రమోషన్లల్లో పాల్గొంటుంది. అందులో భాగంగా శిల్పాశెట్టి హోస్ట్‌గా వ్యవహరించే చాట్ షో ‘షేప్ ఆఫ్ యూ’లో పాల్గొంది. ఈ షోలో ఆసక్తికర కబుర్లను అభిమానులతో పంచుకుంది. 

 

కరోనా ఫస్ట్‌వేవ్ విలయతాండవం చేసినప్పుడు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో తాను ఒంటరితనానికి గురయ్యానని అందుకోసం చికిత్స తీసుకున్నానని జాక్వెలిన్ ఫెర్నాండెజ్ చెప్పింది. ‘‘కరోనా మహమ్మారి విలయతాండవం చేసిన 2020లో ఒంటరితనానికి గురయ్యాను. నాలాగే చాలా మంది ఆ విధంగా ఫీల్ అయ్యి ఉంటారని భావిస్తున్నాను. ఒంటరితనాన్ని అనుభవిస్తున్నామనే బాధ కూడా వారికి తెలియదు. దీంతో చాలా మంది ఆందోళనకు లోనయ్యారు. కొంతమంది మరణించారు. మరికొందరు ఉపాధిని కోల్పోయారు. ఈ పట్టణంలో చాలామంది ఒంటరిగా జీవనాన్ని గడుపుతున్నారు. వీరందరూ కుటుంబంతో కలిసి ఉండరు. బాధలను మరొకరితో పంచుకోవడానికి ఇష్టపడరు. ఆ బరువును దించుకోరు. నేను ఒక థెరపిస్ట్ దగ్గరికి వెళ్లి కొంతకాలం చికిత్స తీసుకున్నాను. అది నాకు ఎంతో ఉపయోగపడింది’’ అని జాక్వెలిన్ ఫెర్నాండెజ్ చెప్పింది.

Updated Date - 2022-03-13T21:24:26+05:30 IST