తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలను పొగడ్తలతో ముంచెత్తిన బీ టౌన్ బ్యూటీ

ABN , First Publish Date - 2022-07-01T23:01:45+05:30 IST

బాలీవుడ్‌తో పాటు సౌత్ లోను సినిమాలు చేసి ఫేమ్ సంపాదించుకున్న అందాల భామ హ్యూమా ఖురేషీ (Huma Qureshi). చివరగా అజిత్ నటించిన ‘వలీమై’ (Valimai) చిత్రంతో అభిమానులను అలరించారు.

తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలను పొగడ్తలతో ముంచెత్తిన బీ టౌన్ బ్యూటీ

బాలీవుడ్‌తో పాటు సౌత్ లోను సినిమాలు చేసి ఫేమ్ సంపాదించుకున్న అందాల భామ హ్యూమా ఖురేషీ (Huma Qureshi). చివరగా అజిత్ నటించిన ‘వలీమై’ (Valimai) చిత్రంతో అభిమానులను అలరించారు. తాజాగా ఆమె మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో ఆసక్తికర కబుర్లను అభిమానులతో పంచుకున్నారు. దక్షిణాది ఇండస్ట్రీని ఆమె పొగడ్తలతో ముంచెత్తారు. తెలుగు, తమిళ సినిమా పరిశ్రమలు ప్రేక్షకులను తక్కువ చేసి చూపించవని ఆమె తెలిపారు. 


తెలుగు, తమిళ పరిశ్రమల నుంచి ఎంతో నేర్చుకోవాలని హ్యూమా ఖురేషీ తెలిపారు. ‘‘తెలుగు, తమిళ సినీ ఇండస్ట్రీలు భారీ స్థాయిలో సినిమాలను నిర్మిస్తూ అన్ని చోట్ల మార్కెట్‌ను సంపాదించుకుంటున్నాయి. సాంస్కృతుల ఆధారంగా సినిమాలు రూపొందిస్తున్నందుకు గర్విస్తున్నాయి. ప్రస్తుతం పాన్ ఇండియా చిత్రాలను రూపొందిస్తున్నారు. ప్రతి నటుడు తమ ఫ్యాన్ బేస్‌ని పెంచుకుంటున్నారు. రజినీకాంత్, అజిత్‌(Ajith) తో నటించడం ద్వారా నేను ఎంతో నేర్చుకున్నాను. ప్రేక్షకురాలిగా సినిమాలు చూడటం మొదలుపెట్టాను. పాన్ ఇండియా చిత్రాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. దేశంలో సినిమాల విషయంలో బౌండరీలు ఎందుకు విధించుకోవాలి. ఇండస్ట్రీలో ఉన్న కొద్దిపాటి అడ్డంకులను అధిగమించి ఒకరికి మరొకరం సహకరించుకోవాలి’’ అని హ్యూమా ఖురేషీ తెలిపారు. ఆమె గతంలో రజినీకాంత్ (Rajinikanth) నటించిన కాలా సినిమాలో కూడా కీలక పాత్ర పోషించారు. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించిన ‘గంగూబాయి కతియావాడి’ లో అతిథి పాత్రలో మెరిశారు. ప్రస్తుతం ‘టర్ల’ సినిమాలో నటిస్తున్నారు. చెఫ్ టర్ల దలాల్ జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఇవి మాత్రమే కాకుండా మరికొన్ని ప్రాజెక్టులు కూడా ఆమె చేతిలో ఉన్నాయి.

Updated Date - 2022-07-01T23:01:45+05:30 IST