మిర్రర్ సెల్ఫీ తీసుకున్న దిశా పటానీ.. రిప్లై ఇచ్చిన హృతిక్ రోషన్ మాజీ భార్య
ABN , First Publish Date - 2022-03-26T02:41:45+05:30 IST
బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు అన్ని ఇండస్ట్రీస్లో
బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు అన్ని ఇండస్ట్రీస్లో నటిస్తున్న హాట్ బ్యూటీ దిశా పటానీ. ఆమె మోడల్గా తన ప్రస్థానాన్ని ఆరంభించింది. అనంతరం వెండితెర పైకి నటిగా ఎంట్రీ ఇచ్చింది. పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ‘లోఫర్’ తో హీరోయిన్గా మారింది. ఈ మూవీ అనంతరం హిందీ నుంచి ఆమెకు వరుసగా అవకాశాలు రావడంతో ముంబైలోనే స్థిరపడింది. బీ టౌన్లో తొలి ప్రాజెక్టుగా ‘ఎమ్ఎస్ ధోనీ అన్టోల్డ్ స్టోరీ’ చిత్రంలో నటించింది. ఈ మూవీలో సుశాంత్ సింగ్ రాజ్ఫుత్ సరసన హీరోయిన్గా మెప్పించింది. ప్రస్తుతం ఆమె ‘యోధ’, ఏక్ విలన్-2’ వంటి చిత్రాల్లో నటిస్తుంది.
బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీకి యూత్లో మంచి క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. ఆమె ఇన్స్టాగ్రామ్ అకౌంట్కు కోట్ల కొద్ది ఫాలోయర్స్ ఉన్నారు. నెటిజన్స్ అందరినీ తన పోస్ట్లతో ఆమె ఎల్లప్పుడు అలరిస్తుంటుంది. తాజాగా దిశ ఇన్స్టాలో ఓ పోస్ట్ పెట్టింది. అద్దం ముందు నిల్చుని మిర్రర్ సెల్ఫీ తీసుకుంది. ఈ పిక్ను ఆమె నెటిజన్లతో పంచుకుంది. ఎమోజీలను క్యాప్షన్గా ఇచ్చింది. ఈ పోస్ట్కు సోషల్ మీడియా యూజర్స్ నుంచి మంచి స్పందన లభించింది. ఆమె అకౌంట్ను నెటిజన్లందరూ కామెంట్లతో హోరెత్తించారు. ఈ ఫొటోకు హృతిక్ రోషన్ మాజీ భార్య సుసానే ఖాన్ రిప్లై ఇచ్చింది. హాటీ డాల్ అంటూ కామెంట్ చేసింది.