‘లేడి కిల్లర్’గా రాబోతున్న బాలీవుడ్ బ్యూటీ.. ఈ సినిమా నన్ను కంఫర్ట్ జోన్ నుంచి..
ABN , First Publish Date - 2022-01-12T19:48:50+05:30 IST
‘దమ్ లాగాకే హైసా’ సినిమాతో 2015లో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి.. మొదటి మూవీకే ఫిలింఫేర్ అవార్డు పొందిన బ్యూటీ భూమి పడ్నేకర్.
‘దమ్ లాగాకే హైసా’ సినిమాతో 2015లో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి.. మొదటి మూవీకే ఫిలింఫేర్ అవార్డు పొందిన బ్యూటీ భూమి పడ్నేకర్. అనంతరం కూడా మంచి కథలను ఎంచుకుంటూ మంచి గుర్తింపు సాధించింది. ఈ ఏడాది ఇప్పటికే నాలుగు సినిమాలను కమిటైన ఈ భామ తాజాగా ‘ది లేడి కిల్లర్’ చిత్రంలో నటించనుంది.
అర్జున్ కపూర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ మూవీకి అజయ్ బౌల్ దర్శకత్వం వహిస్తుండగా.. టీ సిరీస్ సంస్థ నిర్మిస్తోంది. ఎన్నో ఎమోషన్స్ కలగలిపిన ఈ చిత్రంలో నటించనుండడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపింది భూమి.
ఈ సినిమా గురించి భూమి మాట్లాడుతూ.. ‘నాకు ఎప్పుడు కొత్తగా, ఛాలెంజింగ్గా ఉండే కథలు చేయాలని ఉంటుంది. అలాంటివి నా దగ్గరకి వస్తే చాలా ఎగ్జాయిటింగ్గా ఫీల్ అవుతా. అలాంటి కథే ‘ది లేడి కిల్లర్’. ఓ నటిగా కంఫర్ట్ జోన్లో ఉన్న నన్ను ఈ సినిమా ఖచ్చితంగా బయటికి తోస్తుంది. ఇంకా ఎన్నో కొత్త కథలను ఎంచుకునే ధైర్యాన్ని ఇస్తుందని నమ్ముతున్నా. అర్జున్, డైరెక్టర్ అజయ్, నిర్మాత భూషణ్తో కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నాన’ని చెప్పింది.
ఓ చిన్న పట్టణంలో ఉండే ప్లే బోయ్ ఓ అందమైన అమ్మాయితో ప్రేమలో పడ్డా తర్వాత జరిగే పరిణామమే ఈ చిత్రం. ఇందులో థ్రిల్లింగ్ ట్విస్ట్లు, సస్పెన్స్తో కూడిన ఈ మూవీ ఎంతో వినోదాన్ని పంచుతుందటా.
భూమి గురించి టీ సిరీస్ హెడ్ భూషణ్ కుమార్ మాట్లాడుతూ.. ‘విభిన్నమైన, మంచి టాలెంట్ ఉన్న భూమి మా టీంలోకి రావడం ఆనందంగా ఉంది. మొదటిసారి కలిసి నటిస్తున్న అర్జున్, భూమి కెమిస్ట్రీ, అజయ్ చిత్రికరణ అందరినీ ఆకట్టుకుంటుందని ఆశిస్తున్న’ట్లు తెలిపాడు.
అలాగే డైరెక్టర్ అజయ్ మాట్లాడుతూ.. ‘ఈ చిత్రంలో ఎన్నో ఎమోషన్స్ ఉన్నాయి. అందుకే ప్రతి సీన్ని ముందుకు తీసుకెళ్లగలిగే నటులు కావాలి. అలాంటి ప్రతిభ ఉన్న అర్జున్, భూమి ప్రధాన పాత్రలను చేయనుండడం చాలా సంతోషంగా ఉంది. వారి ప్రత్యే సిగ్నచర్ స్టైల్ ఈ సినిమాకి ప్లస్ అవుతుందని ఆశిస్తున్నాన’ని చెప్పుకొచ్చాడు.