వామికకు దూరంగా ఉండే సమయం విలువైంది కాబట్టి మంచి స్క్రిఫ్ట్‌ల ఎంపికపై దృష్టి సారించాను: అనుష్క శర్మ

ABN , First Publish Date - 2022-05-02T00:59:09+05:30 IST

అందం, అభినయంతో ప్రేక్షకులను అలరించిన బాలీవుడ్ నటి అనుష్క శర్మ. విరాట్ కోహ్లిని పెళ్లి చేసుకున్నతర్వాత సినిమాలకు అనుష్క బై బై చెప్పేసింది.

వామికకు దూరంగా ఉండే సమయం విలువైంది కాబట్టి మంచి స్క్రిఫ్ట్‌ల ఎంపికపై దృష్టి సారించాను: అనుష్క శర్మ

అందం, అభినయంతో ప్రేక్షకులను అలరించిన బాలీవుడ్ నటి అనుష్క శర్మ. విరాట్ కోహ్లిని పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలకు అనుష్క బై బై చెప్పేసింది. చివరగా ఆమె ‘జీరో’ సినిమాలో కనిపించింది. ఈ చిత్రం 2018లో విడుదలైంది. నాలుగేళ్ల అనంతరం ఆమె సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వనుంది. మే 1న అనుష్క పుట్టినరోజు జరుపుకొంటుంది. ఈ నేపథ్యంలో ఆమె మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూలో ఆసక్తికర కబుర్లను అభిమానులతో పంచుకొంది. 


వ్యక్తిగత జీవితంతో పాటు పనిని బ్యాలెన్స్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్టు అనుష్కశర్మ తెలిపింది. ‘‘నా కూతురు వామికకు దూరంగా ఉండే సమయం విలువైంది. అందువల్లే మంచి స్క్రిఫ్ట్‌ల ఎంపికపై దృష్టి సారించాను. మంచి సినిమాలు చేయడంతోనే నేడు ఈ స్థాయికీ చేరుకున్నాను. ఆసక్తికరమైన కంటెంట్, మహిళా ప్రాధాన్య సినిమాలు చేయడానికి నేను సిద్ధమే. అటువంటి ప్రాజెక్టులు నా దగ్గరకు వస్తే నేను సంతోషంగా చేస్తాను’’ అని అనుష్క శర్మ చెప్పింది. ప్రస్తుతం ఆమె ‘ఛక్ దా ఎక్స్‌ప్రెస్’లో నటిస్తుంది. ఇండియన్ క్రికెట్ టీం మాజీ కెప్టెన్ ఝులన్ గోస్వామి జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలోని పాత్రకు న్యాయం చేకూర్చాలని అనుష్క పరితపిస్తుంది. అందుకోసం క్రికెట్ ట్రైనింగ్ కూడా తీసుకుంటుంది. ‘ఛక్ దా ఎక్స్‌ప్రెస్’ తనకు ఎంతో ప్రత్యేకమైన చిత్రమని అనుష్క వెల్లడించింది. ఓ మహిళగా ఝులన్ పాత్రను పోషించడం తనకెంతో గర్వకారణమని పేర్కొంది. క్రికెట్ లవర్స్, ప్రేక్షకులకు ఆమె కథను చెప్పబోతున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని స్పష్టం చేసింది.

Updated Date - 2022-05-02T00:59:09+05:30 IST