ఎంటర్ ప్రెన్యూర్‌గా మారిన బాలీవుడ్ బ్యూటీ

ABN , First Publish Date - 2022-03-25T01:09:41+05:30 IST

సునీల్ శెట్టి కూతురిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన తనకంటూ

ఎంటర్ ప్రెన్యూర్‌గా మారిన బాలీవుడ్ బ్యూటీ

సునీల్ శెట్టి కూతురిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న సుందరి అతియా శెట్టి. స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నిర్మించిన ‘హీరో’ సినిమా ద్వారా ఆమె బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. అనంతరం అనేక మూవీస్‌లో నటించినా కూడా ఆశించినంత మేర ఆమెకు సక్సెస్ దక్కలేదు. అతియా గత మూడేళ్లుగా టీమిండియా క్రికెటర్ కేఎల్. రాహుల్‌తో డేటింగ్ చేస్తోందని బీ టౌన్ మీడియా తెలుపుతోంది. అతియా త్వరలోనే కేఎల్.రాహుల్‌ని పెళ్లి చేసుకోబోతోందని సమాచారం.


అతియా శెట్టి తాజాగా ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారింది. ‘స్టేజ్-3’ అనే స్టార్టప్‌లో పెట్టుబడి పెట్టింది. ‘స్టేజ్-3’ అనేది సోషల్, కామర్స్ ప్లాట్‌ఫాం. ఫ్యాషన్, లైఫ్ స్టైల్ ఉత్తత్తులను ఈ ప్లాట్‌ఫాం విక్రయిస్తుంది. ఈ సంస్థలో అతియా క్రియేటివ్ డైరెక్టర్‌గా కూడా నియమితులైంది. ఈ సోషల్ కామర్స్ ప్లాట్‌ఫాం తాజాగా రూ.20కోట్లను రైజ్ చేసింది. అందులో భాగంగానే ఆమె పెట్టుబడి పెట్టింది. 



Updated Date - 2022-03-25T01:09:41+05:30 IST