‘‘ఇంతకు ముందంత మథురంగా... ఇప్పుడు లేదు...’’ BIG B నిర్వేదం

ABN , First Publish Date - 2021-11-07T00:40:00+05:30 IST

తన నివాసం ‘జల్సా’లో దీపావళి వేళ ‘ఓ వింత నిశ్శబ్ధం’ రాజ్యమేలిందంటూ అమితాబ్ బచ్చన్ తన బ్లాగ్‌లో రాసుకొచ్చారు! ‘‘ఓ దీపావళి రాత్రి వేళ, దాదాపుగా ఎటువంటి టపాసుల శబ్ధాలు లేని, ఇటువంటి నిశ్శబ్ధ స్థితి నా చెవులు అసలు నమ్మలేకపోతున్నాయి’’ అన్న ఆయన బచ్చన్ ఫ్యామిలీ మెంబర్స్ గురించి కూడా బ్లాగ్‌లో రాశారు...

‘‘ఇంతకు ముందంత మథురంగా... ఇప్పుడు లేదు...’’ BIG B నిర్వేదం

తన నివాసం ‘జల్సా’లో దీపావళి వేళ ‘ఓ వింత నిశ్శబ్ధం’ రాజ్యమేలిందంటూ అమితాబ్ బచ్చన్ తన బ్లాగ్‌లో రాసుకొచ్చారు! ‘‘ఓ దీపావళి రాత్రి వేళ, దాదాపుగా ఎటువంటి టపాసుల శబ్ధాలు లేని, ఇటువంటి నిశ్శబ్ధ స్థితి నా చెవులు అసలు నమ్మలేకపోతున్నాయి’’ అన్న ఆయన బచ్చన్ ఫ్యామిలీ మెంబర్స్ గురించి కూడా బ్లాగ్‌లో రాశారు... 


‘‘గది నిండా కుటుంబ సభ్యులే... అయినా ఎవరి సెల్ ఫోన్ ప్రపంచంలో వాళ్లు!’’ అంటూ నిట్టూర్చారు బిగ్ బి. ఆయన ఈ సారి దీపావళి వేడుకని ముంబైలోని తన ఇంట్లోనే జరుపుకున్నారు. జయా బచ్చన్, అభిషేక్, ఐశ్వర్య, ఆరాధ్య బచ్చన్ కూడా ఉన్నారు. కూతురు శ్వేతా నందా, ఆమె పిల్లలు కూడా సీనియర్ బచ్చన్‌తో కలసి దివాలీ సెలబ్రేషన్స్ ఎంజాయ్ చేశారు. అయితే, ఇప్పుడు ఎందుకోగానీ... గతంలోని ఆ మాధుర్యం కొరవడుతోందని... అమితాబ్ అభిప్రాయపడ్డారు. రెండేళ్లుగా ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారి గురించి కూడా ప్రస్తావించిన ఆయన మానవజాతి పెద్ద గండాన్ని ఎదుర్కొని నిలబడగలిగిందని చెబుతూనే... కొన్నేళ్ల కిందటి దీపావళికి, ఇప్పటి వెలుగుల పండుగకి... పోలికే లేదని పెదవి విరిచారు! 

Updated Date - 2021-11-07T00:40:00+05:30 IST