Akshay Kumar: నన్ను క్షమించండి.. ఆ డబ్బుని మంచికి వాడతా..

ABN , First Publish Date - 2022-04-21T16:47:51+05:30 IST

బాలీవుడ్‌లోని స్టార్ హీరోల్లో అక్షయ్ కుమార్ ఒకరు. ఈ నటుడు తన సినిమాలతోనే కాకుండా సందర్భం వచ్చినప్పుడల్లా..

Akshay Kumar: నన్ను క్షమించండి.. ఆ డబ్బుని మంచికి వాడతా..

బాలీవుడ్‌లోని స్టార్ హీరోల్లో అక్షయ్ కుమార్ ఒకరు. ఈ నటుడు తన సినిమాలతోనే కాకుండా సందర్భం వచ్చినప్పుడల్లా అవసరంలో ఉన్నవారికి హెల్ప్ చేస్తూ అభిమానులకు ఇన్‌స్పిరేషన్‌గా నిలుస్తుంటాడు. అయితే ఇటీవల ఆయన చేసిన ఓ పాన్ మాసాలా యాడ్ ఎంతోమంది సినీ లవర్స్‌తోపాటు నటుడి అభిమానులకి కోపం తెప్పించింది. అదే పాన్ మాసాలా ప్రొడక్ట్ అయినా దీంతో సోషల్ మీడియాలో వీపరీతంగా ట్రోల్ చేశారు. తాజాగా ఈ ప్రకటన విషయంపై అభిమానులకి క్షమాపణలు తెలుపుతూ ఈ హీరో ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ స్టేట్‌మెంట్‌ని విడుదల చేశాడు.


అక్షయ్ చేసిన ఆ పోస్ట్‌లో.. ‘నన్ను క్షమించండి. నేను నా అభిమానులు, శ్రేయోభిలాషులందరికీ క్షమాపణలు చెప్పాలనుకుంటున్నాను. కొన్ని రోజులుగా పాన్ మసాలా ప్రకటనపై మీ స్పందన నన్ను తీవ్రంగా ప్రభావితం చేసింది. నేను పొగాకును ఆమోదించలేదు, ఆమోదించను. విమల్ ఇలాచ్చితో నేను కలిసి పనిచేయడంపై మీ అభిప్రాయాలను గౌరవిస్తున్నాను. నేను వెనక్కి తగ్గానని ఎంతో వినయంగా చెబుతున్నాను. అందుకే.. ఈ యాడ్‌కి సంబంధించి నేను తీసుకున్న పారితోషికాన్ని ఏదైనా మంచి కార్యక్రమానికి ఉపయోగించాలని నిర్ణయించుకున్నాను. అయితే.. అగ్రిమెంట్ ప్రకారం బ్రాండ్ ప్రకటనలను ప్రసారం చేయకుండా ఆపలేను. కానీ.. భవిష్యత్తులో చాలా జాగ్రత్తగా ప్రకటనలు చేస్తానని వాగ్దానం చేస్తున్నాను. ప్రతిఫలంగా నా మీద మీ ప్రేమ, అభిమానం అలాగే ఉంటుందని, ఉండాలని కోరుకుంటున్నా. అక్షయ్ కుమార్’ అంటూ రాసుకొచ్చాడు.



Updated Date - 2022-04-21T16:47:51+05:30 IST